ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ ఇది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం మేర పూర్తి అయ్యింది.
డీవీవీ దానయ్య ఈ సినిమాను 350 కోట్ల తో నిర్మిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.
అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ప్రశాంత్ నీల్ ఆ సినిమా హిట్ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా మొదలు పెట్టాడు.
ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా ప్రకటించాడు.ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 తో పాటు సలార్ సినిమా కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈలోపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్, త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసుకుని ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారని సమాచారం.
అయితే ఈ సినిమా ఉంటుందో లేదో అనే సందేహం కలుగుతున్న సమయంలో ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి ఇంస్టాగ్రామ్ లో నిర్వహించిన చాట్ సెషన్ లో ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా ఉంటుందని ఆమె క్లారిటీ ఇచ్చారు.
ఈ కాంబినేషన్ లో మూవీ రాబోతుందని త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేస్తారని ఆమె తెలిపింది.ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కు తగ్గ కథను రెడీ చేసాడని తెలుస్తుంది.
అందువల్ల ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయి పోయారు.