టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ మరింత పెరిగి పోతుంది.మెగాస్టార్ చిరంజీవి అంటే చాలు ఆయన గురించి ఎటువంటి సినిమాలు వస్తున్నాయని ఎదురు చూసే అభిమానులు ఉంటారు.
ఇప్పటికీ తన నటనను ఇంకా కొత్తదనంతో పరిచయం చేసుకుంటూ పోతున్నాడు చిరంజీవి.టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో బిజీ గా మారాడు.
ఇదిలా ఉంటే చిరంజీవి నటించిన సినిమాలో మరో పవర్ఫుల్ విలన్ నటించనున్న వార్తలు వినిపిస్తున్నాయి.
చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ మరోసారి నటిస్తుంది.ఇక ఈ సినిమాలో మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.
ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదల కాగా అభిమానుల నుండి విపరీతమైన లైకులు వచ్చాయి.ఈ సినిమాలో నిరంజన్ రెడ్డి నిర్మాతగా చేస్తున్నాడు.
ఇక ఈ సినిమాలో విలన్ గా సోనూ సూద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఇక మరో టాలెంటెడ్ నటుడు కూడా ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడట.
ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా.బెంగాలీ నటుడు జిష్షు సేన్ గుప్తా.
ఈయన అశ్వత్థామ సినిమాలో తొలిసారిగా క్రైమ్ విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమాలో మరో మెగా యంగ్ హీరో రామ్ చరణ్ గంటసేపు ఉండేలా ఓ కీలక పాత్రలో నటించడానికి దర్శకుడు ఏర్పాటు చేశారట.
ఇక ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమా మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.