యూపీలో మతాల వాధనలు, మతస్తుల పోలికలు వింత వింతగా ఉంటాయి.హిందువులు ఎక్కువగా ఉండే యూపీలో ఎప్పుడు ఏదో ఒక మతంకు సంబంధించిన వివాదం జరుగుతూనే ఉంటుంది.
మతాల గురించి జనాలు కొట్టుకోవడం పాత పద్దతి అయ్యింది.ఇప్పుడు ఆ గొడవల్లోకి దేవుళ్లను లాగడం కొత్త పద్దతి అయ్యింది.
తాజాగా యూపీ సీఎంతో పాటు పలువురు ముఖ్యమైన బీజేపీ నేతలు హనుమంతుడు దళితుడు అంటూ వ్యాఖ్యలు చేశారు.ఆంజనేయుడు దళితుడు అవ్వడం వల్ల ఆయన కాస్త వివక్షకు గురి అయ్యాడు అంటూ వారు వ్యాఖ్యలు చేశారు.
ఆంజనేయుడు రాముడి యుగంకు చెందిన వ్యక్తి అప్పట్లో ఈ పాడు కులాలు, మతాలు లేనే లేవు.లేని వాటిని ఆంజనేయుడికి ఆపాదించడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ ఎక్కువ శాతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆంజనేయుడు ఏ కులానికి చెందిన వాడు కాదు అంటూ కొందరు వాదిస్తున్నారు.ఈ సమయంలోనే ఆంజనేయుడు అసలు హిందువే కాదని, మా ముస్లీం అంటూ కొత్త వాదన పుట్టుకు వచ్చింది.
బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.హనుమాన్ అనే పేరు ముస్లీం పేరని, ఆ పేరు నుండే రెహ్మాన్, ఫర్మాన్, జీనాన్, సులేమాన్ వంటి పేర్లు వచ్చినట్లుగా ఆయన చెబుతున్నాడు.రామ భక్తుడు అయిన హనుమంతుడిని ముస్లీం వ్యక్తి అంటూ చెప్పడంతో ఆ ఎమ్మెల్సీపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.హనుమంతుడిని ముస్లీం అంటూ వ్యాఖ్యలు చేయడం ఆయన అవివేకం అంటున్నారు.
ముస్లీంలు కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు.హనుమాన్ పేరు ఉంటే ముస్లీం అని ఎలా అంటావు అంటూ ముస్లీంలు బుక్కల్ నవాబ్ను ప్రశ్నిస్తున్నారు.పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ పబ్లిసిటీ కోసం ఈ నాయకులు తాపత్రయ పడుతున్నారు, తప్ప అన్ని కూడా అడ్డ దిట్టమైన వ్యాఖ్యలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.