తెలుగు సినిమాల్లో హీరోయిన్లకి అందే పారితోషికం చాలా అంటే చాలా తక్కువ.ఉదాహరణకు చెప్పాలంటే అత్యధికంగా పారితోషికం అందుకుంటున్న హీరో మహేష్ బాబు.
మన సూపర్ స్టార్ ఒక్కో సినిమాకి అందుకునేది 25 కోట్లకుపైనే.మరి అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్ అనుష్క మార్కెట్ రేట్ ఏంతో తెలుసా? దాదాపుగా రెండున్నర కోట్లు.ఎంత తేడానో చూడండి.పాతిక కోట్లు ఎక్కడ, రెండు మూడు కోట్లు ఎక్కడ.అయితే ఈ తేడా ఇక్కడే కాదు, బాలివుడ్ లోనూ అంతే.కాకపొతే ఇక్కడివారితో పోలిస్తే బాలివుడ్ భామలు ఎక్కువ అందుకుంటారు.
మరి సాహో కోసం బాలివుడ్ భామ శ్రద్ధ కపూర్ నే తీసుకున్నారుగా.శ్రద్ధకి బాలివుడ్ రేటు ఇస్తున్నారా లేక టాలివుడ్ రేటా? ఇదే కదా మీ అనుమానం.శ్రద్ధకి తెలుగులో ఇప్పటివరకు ఏ హీరోయిన్ అందుకొని పారితోషికం ఇస్తున్నారు.అనుష్క కంటే ఎక్కువ ఎమౌంట్ కావడం గమనార్హం.తన తోలి తెలుగు సినిమాతోనే శ్రద్ధ ఏకంగా 4 కోట్లు అందుకోబోతోంది.దక్షిణాదిలో కేవలం నయనతార మాత్రమే ఈ రేటు దరిదాప్పుల్లో ఉంది.
శ్రద్ధ కపూర్ ని హీరోయిన్ గా ప్రకటిస్తూ నిన్న యూవీ క్రియేషన్స్ వారు అఫీషియల్ ప్రకటన చేసారు.తెలుగు స్టాప్ ఈ వార్తని కొన్నిరోజుల ముందే బయటపెట్టడం మీకు గుర్తు ఉండే ఉంటుంది.
మొదట దిశా పటాని పేరుని పరిశీలించినా, తన పాపులారిటికి మించి ఆ అమ్మడు రెమ్యునరేషన్ అడగటంతో వద్దనుకున్నారు.ఇక పరినీతి చోప్రా పేరు కూడా వినిపించినా, చోప్రాతో పోలిస్తే శ్రద్ధకి క్రేజ్ ఎక్కువ కాబట్టి చివరకి శ్రద్ధనే ఫైనల్ చేసుకున్నారు.
శ్రద్ధ ఈ నెల 19న యూనిట్ లో కలుస్తుందని సమాచారం.150 కోట్ల భారి బడ్జెట్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న సాహోలో మరో బాలివుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ విలన్ గా కనిపించనున్నాడు.సుజీత్ ఈ భారి చిత్రానికి దర్శకుడు.