తాజాగా కొందరు ఆర్కియాలజిస్టులు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పెయింటింగ్ కనుగొన్నట్లు తెలియజేస్తున్నారు.గుహలోని పెయింటింగ్ ఆర్కియాలజిస్టులు ప్రపంచంలోనే అత్యంత పురాతన పెయింటింగ్ గా పేర్కొంటున్నారు.
ఈ పెయింటింగ్ ను 45,500 సంవత్సరాల కిందట వేసిన అడవి పంది పెయింటింగ్ అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.ఈ పెయింటింగ్ ఇండోనేషియా లోనీ ఓ పురాతన గుహలో కనుగొనట్లు వారు తెలిపారు.
ఈ ప్రాంతంలోని పరిస్థితులు తొలి మానవ మనుగడ ఎప్పుడు మొదలైంది అన్న విషయాన్ని గుర్తించడానికి అనేక పరిశోధనలు చేస్తున్న ఆర్కియాలజిస్ట్ తెలిపారు.
ఇండోనేషియా దేశానికి సంబంధించిన అత్యంత వెనుకబడిన ప్రాంతం అయిన ఓ ఐలాండ్ లో ఉన్న ఓ గుహలో ఈ పెయింటింగ్ కనుగొన్నట్లు తెలిపారు.
అయితే ఇక్కడికి వెళ్లాలంటే ఎలాంటి రోడ్డు రవాణా ఉండదు.రోడ్డు రవాణా ఉన్న వరకు వెళ్లి అక్కడి నుంచి దాదాపు కొన్ని గంటల పాటు నడిచి వెళితే తప్ప ఆ గుహకు మనుషులు చేరుకోలేరు.
అది కూడా కేవలం వేసవికాలం లోనే ఈ గుహకు చేరుకోగలరు.దీనికి కారణం మిగతా సమయాలలో ఆ దట్టమైన ప్రాంతంలో విపరీతమైన నీటి ప్రవాహం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
ఇక ఈ పెయింటింగ్ సంబంధించిన విషయాలు చూస్తే.ఇది 136 సెంటీమీటర్ల వెడల్పు, 54 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంది.
ఈ పెయింటింగ్ లో అడవి పందిని వేసినట్లు కనపడుతోంది.
ఈ అడవి పంది ముదురు ఎరుపు రంగు తో వేసినట్లు కనబడుతోంది.ఈ పెయింటింగ్ వేసిన వారి చేతి ముద్రలు సైతం అక్కడ కనపడుతున్నాయి.ఈ పెయింటింగ్ తో పాటు మరో రెండు పెయింటింగ్స్ కూడా ఉన్నాయి అవి పాక్షికంగానే కనిపిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
ఈ పెయింటింగ్ యురేనియం సిరీస్ ఇస్టోప్ డేటింగ్ సహాయంతో 45 వేల సంవత్సరాల కిందట అని తెలియజేస్తున్నారు.
.