సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం సాయంత్రం సమయంలో సోషల్ మీడియాలో ఈ ఫొటో ప్రత్యక్ష్యం అయ్యింది.రాజమౌళి షేర్ చేసిన ఈ ఫొటో అప్పుడు ఒక నార్మల్ ఫొటో అని అంతా అనుకున్నారు.
అప్పుడే ఆయన ఏదో చెప్పాలనే ఉద్దేశ్యంతో కన్ను కొడుతున్న ఈమోజీ ని షేర్ చేశాడు.ఆ సమయంలో కొందరు ఇది నార్మల్ ఫొటోనే కాని వీరి ముగ్గురి కాంబోలో సినిమా వస్తే ఎంత అద్బుతంగా ఉంటుందని అనుకున్నారు.
అద్బుతంను ఆవిష్కరించడంలో రాజమౌళి తర్వాతే ఎవరైన.కనుక ఈ అద్బుతంను ఆయన మాత్రమే ఆవిష్కరించగలడు.
కనుక ప్రతి ఒక్కరు కూడా వీరి ముగ్గురి కాంబోలో సినిమా రావాలని బలంగా కోరుకున్నారు.కొన్ని రోజుల తర్వాత మీడియాలో మెల్ల మెల్లగా వార్తలు మొదలు అయ్యాయి.
ఆ కలయిక నిజంగా సినిమా కోసమే అని.రాజమౌళి స్టోరీ లైన్ సిద్దం అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా చెబుతూ వచ్చారు.అలా అలా మెల్ల మెల్లగా సినిమా రివీల్ అయ్యింది.
ముగ్గురు ఆర్ లు అంటే రాజమౌళి రామ్ చరణ్ రామారావు.
ఈ ముగ్గురు కలిసి సినిమా చేయాలి.ఇంతకు ముందు వీరు కలిసి వర్క్ చేశారు.
కాని ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి వర్క్ చేయలేదు.కనుక ఒక అద్బుతంను ఖచ్చితంగా ఆవిష్కరించబోతున్నారు అంటూ ప్రతి ఒక్కరు చాలా నమ్మకంగా అనుకున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ప్రకటించిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా కళ్ల ముందు మరో బాహుబలిని ఊహించుకున్నారు.ఇప్పుడు బాహుబలి కాదు అంతకు మించి ఆర్ ఆర్ ఆర్ రూపొందినట్లుగా చెబుతున్నారు.ఈ రోజుకు నాలుగు ఏళ్లు ఆర్ ఆర్ ఆర్ సినిమా కు విత్తనం పడి.కనుక అభిమానులు సోషల్ మీడియాలో ఈ సందర్బంను షేర్ చేసుకుంటున్నారు.ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 7న రాబోతున్న విషయం తెల్సిందే.