మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు తెరకెక్కాయి.ఈ సినిమాలలో ఒకటి అతడు కాగా మరొకటి ఖలేజా అనే సంగతి తెలిసిందే.
ఈ రెండు సినిమాలలో అతడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైతే ఖలేజా సినిమా మాత్రం డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుందనే సంగతి తెలిసిందే.అయితే అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో మహేష్ త్రివిక్రమ్ కాంబో సెట్ అయింది.
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోవడంతో ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అయింది.ఆ తర్వాత మహేష్ ను త్రివిక్రమ్ సంప్రదించగా ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది.
అయితే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఆలస్యం కావడానికి మహేష్ కారణమని సమాచారం.త్రివిక్రమ్ చెప్పిన కథకు మహేష్ బాబు తరచూ మార్పులు చెబుతూ ఉండటంతో మహేష్ చుట్టూ త్రివిక్రమ్ పదేపదే తిరగాల్సి వస్తోందని తెలుస్తోంది.
అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చినా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను మహేష్ బాబు అస్సలు నమ్మడం లేదు.మహేష్ తాజాగా కథను ఓకే చేశాడని వార్తలు వస్తున్నా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
మహేష్ త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదలవుతుందో చూడాల్సి ఉంది.షూటింగ్ ఇప్పుడు మొదలైతే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
త్రివిక్రమ్ అల వైకుంఠపురములో సక్సెస్ తర్వాత వేగంగా సినిమాలను తెరకెక్కించకపోవడం ఆయన అభిమానులను హర్ట్ చేసింది.త్రివిక్రమ్ ఇకనైనా వరుసగా సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.త్రివిక్రమ్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారేమో చూడాల్సి ఉంది.త్రివిక్రమ్ ఈ సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.