మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్( Boxing Championship ) 2023లో నీతు ఘంఘాస్ దేశానికి బంగారు పతకాన్ని అందించింది.ఢిల్లీలో జరిగిన IBA మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆమె 45-48 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్( Lutsai Khan ) (5-0)ను ఓడించింది.
తొలిసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది.అంతకుముందు సెమీఫైనల్లో కజకిస్థాన్కు( Kazakhstan ) చెందిన అలువా బల్కిబెకోవాపై 5-2 తేడాతో నెగ్గి నీతూ ఫైనల్కు చేరుకుంది.నీతూ సాధించిన ప్రధాన విజయాలు 1.2017 సంవత్సరంలో గౌహతిలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకం.2.2018 సంవత్సరంలో ఆసియా ఛాంపియన్షిప్లో బంగారు పతకం.3.2018 సంవత్సరంలో ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకం.4.2022లో బల్గేరియాలోని సోఫియాలో జరిగిన స్ట్రెడ్జా కప్లో బంగారు పతకం.5.2022లో బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకం.6.2023లో న్యూఢిల్లీలో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.హర్యానాలోని భివానీలోని ధననా గ్రామానికి చెందిన నీతూ 2012లో బాక్సింగ్ కెరీర్ను ప్రారంభించింది.ఆమె కోచ్ జగదీష్( Coach Jagdish ).ఆమె కష్టపడి ఈరోజు ఈ స్థాయికి చేరుకుంది.ఆమె బాక్సర్ విజేందర్ సింగ్ను తన స్ఫూర్తిగా భావిస్తుంది.
బాక్సర్ విజేందర్ సింగ్ 2010 ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత, నీతు కూడా బాక్సింగ్లో తన ప్రతిభను చూపాలని నిర్ణయించుకుంది.
మినీ క్యూబాగా పేరొందిన నీతూ పంచ్లకు భారత అనుభవజ్ఞుడైన బాక్సర్ ఎంసీ మేరీకోమ్( Boxer MC Mary Kom ) తడబడింది.కామన్వెల్త్ గేమ్స్లో రింగ్ మ్యాచ్లో మోకాలికి గాయం కావడంతో మేరీ కోమ్ 48 కిలోల ట్రయల్స్ మధ్యలోనే వైదొలగవలసి వచ్చింది.ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మేరీకోమ్ను సెమీఫైనల్ తొలి రౌండ్లో నీతూను ఓడించింది.
నీతూ తండ్రి జై భగవాన్ తన కూతురికి అనునిత్యం అండగా నిలిచాడు.కూతురిని ప్రోత్సహించేందుకు తండ్రి తన ఉద్యోగాన్ని కూడా పణంగా పెట్టాడు.
నీతు తండ్రి చండీగఢ్ శాసనసభలో పని చేసేవాడు, జై భగవాన్ తన కుమార్తె కల కోసం తన పదవి నుండి వేతనం లేని సెలవు తీసుకొని గ్రామంలో నివసించడం మొదలుపెట్టారు.నీతు తండ్రి నాలుగేళ్లుగా వేతనం లేని సెలవులో ఉన్నాడు.
నీతు కలలను నెరవేర్చడానికి నీతు తండ్రి తనకు సంబంధించిన అన్నింటినీ పణంగా పెట్టాడు.నీతు ప్రస్తుతం చౌదరి బన్సీలాల్ విశ్వవిద్యాలయం నుండి MPEd చదువుతోంది.