పెయింటింగ్ లను అర్థం చేసుకునే సత్తా ఉంటే పెయింటింగ్ లో గొప్పగొప్ప నిగూఢ అర్థం ఉంటుంది.మనకు గొప్ప గొప్ప పెయింటింంగ్స్ వేసిన వారు, వారు వేసిన పెయింటింగ్స్ చరిత్రలో నిలిచిపోయాయి.
ఉదాహరణకు పికాసో, రవి వర్మ తీసుకుంటే పెయింటింగ్స్ ప్రస్తావన ఎక్కడ వచ్చినా వీరిద్దరి ప్రస్తావన రాక మానదు.ఏదైనా పెయింటింగ్ ని పోల్చాలంటే అచ్చం పికాసో పెయింటింగ్ లా ఉంది అని అంటాం.
పెయింటింగ్స్ తో గొప్ప గొప్ప జీవిత సత్యాలు చెప్పిన మహానుభావులు ఉన్నారు.అందుకే కొన్ని కొన్ని పెయింటింగ్స్ కు కోట్లు ధర పలుకుతుంది.
ముఖ్యంగా కాన్యాస్ పెయింటింగ్ కు ధర ఎక్కువగానే ఉంటుంది.కాని మీరిప్పుడు చూడబోయే పెయింటింగ్ ధర ఎంతో తెలిస్తే అవాక్కవుతారు.
బ్రిటిష్ చిత్రకారుడు సచా జాఫ్రీ వేసిన ఈ పెయింటింగ్ ను వేలం వేస్తె 62 మిలియన్ డాలర్ లకు అంటే భారతీయ కరెన్సీలో 450 కోట్ల రూపాయలకు వేలంలో అమ్ముడుపోయింది.అయితే ఇప్పటివరకు అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన పెయింటింగ్ గా గిన్నీస్ రికార్డు లకెక్కింది.17,176 అడుగులు ఉన్న ఈ కాన్యాస్ పెయింటింగ్ మొత్తం 70 భాగాలుగా విభజించబడి ఉంది.ఈ పెయింటింగ్ లో గొప్ప మానవతా కోణాన్ని ప్రతిబింభించాడు.
మనుషుల జీవన శైలి విధానాన్ని ఈ పెయింటింగ్ లో సచా జాఫ్రీ పొందుపరిచాడు.