బీజేపీ ఇప్పడు ఏ ప్రాంతాన్ని పర్యటించినా ఒక సంచలనంగా మారుతోంది.కొన్ని రోజుల క్రితం బీజేపీ జనగామ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మపై, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఛలో జనగామ కు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.అసలు ఈ ఛలో జనగామ కార్యక్రమాన్ని పిలుపు వెనక బీజేపీ ప్రధాన వ్యూహాన్ని నిర్ణయించింది.
త్వరలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కంటే ముందు ప్రజల్లోకి వెళ్ళడానికి బీజేపీ కార్యకర్తల దాడి ఘటనను ఎన్నుకొని తద్వారా కేసీఆర్ పై వ్యతిరేకత తీసుకువచ్చి రాజకీయ అలజడిని సృష్టిస్తే స్థానిక కార్యకర్తలు కొంత ఉత్సాహంగా ఉండి, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్ళే వ్యూహాల్నిరచిస్తే గెలుపును సుగమం చేసుకోవచ్చనేది బీజేపీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.ఇక ఎన్నికల రణరంగంలో ఏమి జరగనుందో వేచి చూడాల్సి ఉంది.
అంతేకాక బీజేపీ వ్యూహాన్ని గమనిస్తున్న టీఆర్ఎస్ పై ప్రస్తుతం ఈ విషయాలపై బహిరంగంగా స్పందించడం లేదు.ఒకవేళ స్పందిస్తే టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.