మన ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీలను చూస్తున్నాం.లవ్ స్టోరీలు ఎప్పుడైనా ఎలా అయినా ఉండనీ అవి అసలు బోర్ కొట్టవు.
ఈ లవ్ స్టోరీలను ఆధారంగా చేసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కే లేదు.అయితే అందులో అన్నీ హిట్ కావు కదా.
కథలో దమ్మున్న సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి.కానీ కొన్ని సార్లు సినిమాలను మించిన ప్రేమకథలు నిజంగానే బయట జరుగుతున్నాయి.
అలాంటి ప్రేమ కథలు ఎంతటి పాపులారిటీ తెచ్చుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అమ్మాయి గొప్పింటి బిడ్డ అయి అబ్బాయి పేద వాడైతే ఇంక ఆ కథకు తిరుగే ఉండదు కదా.
ఇప్పుడు కూడా మనం ఇలాంటి ఓ రియల్ లవ్ స్టోరీ గురించే తెలుసుకోబుతున్నాం.అయితే దీని గురించి తెలిస్తే మాత్రం నిజంగానే షాక్ అయిపోతారు.ఎందుకంటే ఇది సినిమాలకకు తగ్గ లవ్ స్టోరీలా ఉంది.తమిళనాడులోని ఈరోడ్ లో నివసించే సెల్వన్ అలాగే ఇళమతి ప్రేమలో పడ్డారు.
ఇకేముంది తమ బంధాన్ని పెళ్లితో ముడేయాలనుకున్నారు.మరి ప్రేమ పెండ్లిలు అంటే ఎవరూ ఊరుకోరు కదా.
పైగా కులాల పట్టింపు ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇంకేముంది ఇద్దరి పేరెంట్స్ ఒప్పుకోలేదు.
ఇక చేసేది లేక అందరిలాగే వారు కూడా బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకున్నారు.
కొద్ది రోజుల తర్వాత వారు ఎక్కడున్నారనే దానిపై అమ్మాయి పేరెంట్స్ కనిపెట్టి అబ్బాయిని చిత క్కొట్టి ఎత్తుకెళ్లిపోయారు.ఇక అబ్బాయి పోలీస్ కంప్లయింట్ ఇవ్వగా ఇద్దరూ మేజర్లు కావడంతో కేసు నమోదు చేసుకున్నారు.కానీ ఇక్కడే ఓ ట్విస్టు ఉంది.
అదేంటంటే అమ్మాయి అన్నాడీఎంకే పార్టీలో కీలక నేత, మాజీ మంత్రి ఇళమతి కుటుంబ వారసురాలు అని తెలియడంతో పోలీసులు కూడా వెనకడుగు వేస్తున్నారు.కాగా తన భార్య ఇళమతి భర్తకు వాట్సాప్ మెసేజ్ చేసింది.
అందులో తనను చంపేస్తారంటూ వేడుకుంది.దీన్ని మీడియా ముందు చూపిస్తూ అబ్బాయి తమను కలపాలంటూ కోరుతున్నారు.
ఇక చేసేది లేక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
.