సూపర్ స్టార్ మహేష్ బాబు 47 ఏళ్ల వయసులో కూడా హ్యాండ్సమ్ అండ్ యంగ్ చార్మింగ్ లుక్ తో అమ్మాయిలను మాయ చేయడంలో ముందు వరుసలో ఉన్నాడు.అంతలా తన కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో ఈయన మెస్మరైజ్ చేస్తాడు.
ఈయనకు పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న కూడా ఇప్పటికి యువతుల కళల రాకుమారుడిగా కీర్తించ బడుతున్నాడు.
అందుకే ఈయనకు మన టాలీవుడ్ లో మాత్రమే కాదు.
ప్రపంచ వ్యాప్తంగా ఎవర్ గ్రీన్ చార్మింగ్ హీరోగా ఫ్యాన్స్ చేత జేజేలు కొట్టించు కుంటున్నాడు.ఈయన ఏజ్ పెరుగుతున్న అందం మాత్రం తగ్గడం లేదు.
తాజాగా మహేష్ బాబు కొత్త ఫోటో ఒకటి వైరల్ అయ్యింది.ఈ ఫొటోలో మహేష్ కొద్దిగా గడ్డం పెంచి లైట్ బియర్డ్ తో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో కొత్త హెయిర్ స్టైల్ తో ఆకట్టుకునే లుక్ లో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
ఈ ఫోటో మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట మంచి వైరల్ అయ్యింది.ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
అలాగే ఫ్యాన్స్ కు ఈయన కొత్త లుక్ మంచి కిక్ ఇస్తుంది.ఇక త్రివిక్రమ్ తో స్టార్ట్ చేయబోయే సినిమా కోసమే మహేష్ ఈ కొత్త స్టైలిష్ లుక్ అని అంతా అనుకుంటున్నారు.
ఏది ఏమైనా ఈ లుక్ లో మహేష్ మరింత అందంగా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.
మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.ఈ సినిమా ఆగష్టు నెలలో సెట్స్ మీదకు వెళ్లనుందని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.