సినిమాల్లో నటించకపోయినా సినిమా హీరోయిన్ల స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రముఖ సింగర్లలో సింగర్ సునీత ఒకరు.సింగర్ సునీత ఒక పాట పాడటానికి 10 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
సునీత వాయిస్ కు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉండగా తాజాగా సునీత ములుగు జిల్లాలోని గోవిందరావుపేట ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ప్రస్తుతం పరిమితంగా సినిమాలకు ఓకే చెబుతున్న సునీత భర్త పేరు మ్యాంగో రామ్ వీరపనేని అనే విషయం తెలిసిందే.
అయితే రామ్ తండ్రి శివాజీ గోవిందరావుపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి కాగా ఆయన ఎంతోమంది పేదలకు ఇండ్లు కట్టించారని బోగట్టా.కరోనా వల్ల ఆయన చనిపోగా ఆయనపై అభిమానంతో ఊరి ప్రజలు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా సునీత హాజరయ్యారు.
ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సునీత మాట్లాడుతూ మామగారి గురించి అందరూ గొప్పగా మాట్లాడుతుంటే సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఈ మండలంలోని ప్రజలను చూస్తే తనకు సంతోషంగా అనిపిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.ఇంత మంచి ఫ్యామిలీకి కోడలిగా రావడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని సునీత కామెంట్లు చేశారు.
సునీత చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సునీత కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో స్పష్టత రానుంది.
సోషల్ మీడియాలో కూడా సునీత యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.సునీత కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇతర సింగర్లకు కూడా సునీత తన వంతు సపోర్ట్ ను అందిస్తుండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సునీత మనస్సు చాలా మంచి మనస్సు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.