చిరంతన్ భట్ .ఈ పేరు ఎవరిదో కూడా సరిగా తెలియదు తెలుగు ప్రేక్షకులకి.
కాని అందరు అతని పనితనాన్ని మెచ్చుకుంటున్నారు.గౌతమీపుత్ర శాతకర్ణిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏముందిరా బాబు అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
అయినా, పొగడ్తకి కావాల్సింది ప్రతిభ కాని పేరు కాదుగా
ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ చేసిన తప్పేంటి ? గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని దేవిశ్రీ వదిలేసుకోవడం.అది కూడా ఖైదీనం 150 సినిమా కోసం.
రెండు సినిమాలు చూసిన తరువాత, రెండు సినిమాల సంగీతం విన్నాక, ముఖ్యంగా నేపథ్య సంగీతం విన్నాక, దేవిశ్రీప్రసాద్ గౌతమీపుత్ర ఏం ఆలోచించి వదిలేసుకున్నాడు .ఇలాంటి సినిమా వదిలేసి ఖైదీ నం 150 లాంటి సినిమా చేసుకోవడం ఏంటి అని విమర్శిస్తున్నారు
ఇప్పుడు సంక్రాంతి పోటిలో చిరంజీవి – బాలకృష్ణ ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో పక్కనపెడితే, దేవిశ్రీప్రసాద్ – చింతరన్ భట్ పోటిలో మాత్రం చింతరన్ గెలిచేసాడు.