టాలీవుడ్ తో పాటు ప్రెసెంట్ మిగతా ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది చైసామ్ విడాకులు అనే చెప్పాలి.తెలుగులో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఒకేసారి ప్రకటించిన విషయం తెలిసిందే.
వీరు ప్రకటించిన అప్పటి నుండి ఏ న్యూస్ ఛానెల్ చుసిన వీరి గురించిన చర్చలే కొనసాగాయి.
పెద్ద డిబేట్ లు పెట్టి మరి న్యూస్ ఛానెల్స్ ఈ వార్తను ఇంకా హైప్ చేసాయి.
ఎవరికీ వారు ఎవరిదీ తప్పు అనే చర్చలు చేసి అలసిపోయి ఇక వదిలేసారు.కానీ ఎవరిదీ తప్పు అనే విషయం మాత్రం తెలుసుకోలేక పోయింది.రెండు రోజులుగా ఈ విషయం గురించే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.ఇంత జరుగుతుంటే విడిపోయిన జంట మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించే పనిలో ఇద్దరు ఉన్నారు.విడాకుల ప్రకటన తర్వాత నాగ చైతన్య సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా గురించి ట్వీట్ చేసారు.
సినిమా చాలా బాగుందని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు.ఇక సమంత విడాకుల పోస్ట్ తర్వాత మరొక పోస్ట్ ఇప్పటి వరకు పెట్టలేదు.అయితే తాజాగా తన సామ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ పెట్టారు.
ఇప్పటి వరకు ఎమోషనల్ పోస్టులు పెట్టిన సామ్ ఇప్పుడు కెరీర్ గురించి పోస్టులు పెట్టింది.ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు నన్ను నేను మార్చుకోవాలి.నా బెడ్ రూమ్ ను నేను సిద్ధం చేసుకోవాలి.
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.మధ్యాహ్నం వరకు నిద్రపోకూడదు.
ఇక పగటి కలలు మానేసి చేయాల్సిన పనిపై ద్రుష్టి పెట్టాలి.అని సామ్ తన స్టోరీలో పెట్టుకున్నారు.
డివోర్స్ తర్వాత సామ్ చేసిన మొదటి పోస్ట్ కావడంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.