ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమై నటుడు కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.
ఈ క్రమంలోనే కార్తికేయ గత కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన లోహితా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈక్రమంలోనే ఇతని నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం కార్తికేయ నటిస్తున్నటువంటి చిత్రం రాజా విక్రమార్క .
రాజా విక్రమార్క సినిమా ద్వారా శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం కానున్నారు.ఇందులో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటిస్తుండగా ఈ చిత్రాన్ని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో 88 రామారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టీజర్ ను మెగా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ లో విడుదల చేశారు.ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో హీరో కార్తికేయ మాట్లాడుతూ బ్యాచిలర్ గా తన ఆఖరి చిత్రం ఇదేనని ఎలాగైనా ఈ చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నట్లు కార్తికేయ తెలిపారు.
ఇకపోతే చిరంజీవి గారంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన సినిమా పేరును తన సినిమాకి పెట్టుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
నిజానికి ఈ సినిమాను మేమే నిర్మించాలని భావించాము కానీ, కొన్ని కారణాల వల్ల అది వీలు పడలేదని ఈ సందర్భంగా హీరో కార్తికేయ మాట్లాడారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా సాయికుమార్ మాట్లాడుతూ.ఇండస్ట్రీలో అన్ని సినిమాలు బాగుండాలి అందులో ఈ సినిమా ఉండాలి అని తెలియజేశారు.
అదేవిధంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఈ సినిమాకు మూల స్తంభం హీరో కార్తికేయ అని,ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.