తెలంగాణ ఉద్యమం అంత ఉధృతంగా సాగడానికి ఉద్యమకారుల అలుపెరుగని కృషి చేశారనేది మనకు తెలిసిందే.అయితే ఉద్యమం చేయడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది ముగిసిపోయిన అంకం అని చెప్పవచ్చు.
అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఉద్యమకారులకు సరైన న్యాయం జరగలేదనేది తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఉన్న వాదన.అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పటి నుండో పనిచేసిన టీఆర్ఎస్ నాయకులకు ప్రాధాన్యం దక్కలేదనేది కాదనలేని వాస్తవం.
అయితే తాజాగా టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి.
అయితే మొదటి నుండి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉద్యమంలో పాల్గొనని వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, మిగతా వారికి ప్రాధాన్యత తగ్గడంతో బహిరంగంగా అసంతృప్తి జ్వాలలు వెళ్ళ గగ్గుతున్నారు.
అయితే తాజాగా టీఆర్ఎస్ మహిళా నేత అరుణ తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపింది.అయితే ఈ విషయంపై టీఆర్ఎస్ లో పెద్ద ఎత్తున చర్చ నడిచిందని చెప్పవచ్చు.
అయితే ఇప్పటికే ఈటెల వ్యాఖ్యలు, టీఆర్ఎస్ నేత అరుణ, ఉస్మానియా విద్యార్థులు ఇలా వీరి ఆగ్రహం భవిష్యత్తులో కెసీఆర్ కు చిక్కులు తెచ్చి పెడుతుందనడంలో ఆశ్చర్యం లేదు.అయితే ఇప్పటికే టీఆర్ఎస్ లో ఉండి వ్యతిరేకంగా మాట్లాడితే వారిని సస్పెండ్ చేసే ఉద్దేశ్యంలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం.