పుర్రెకో బుద్ధి అని పెద్దలు ఊరికే అనలేదు కదా.ఈ సామెత కొందరిని చూస్తే ఈజీగానే అర్థమవుతోంది.
ఎందుకంటే కేవలం పైశాచిక ఆనందం కోసం వారు చేసే పనులు ఇతరులను ఇబ్బంది పెడుతుంటాయి.అలాంటి వారిని చూస్తే ఎవరికైనా కోపం రాక మానదేమో.
మనషులు తినే వస్తువుల్లో కొందరు అసభ్యకరంగా ప్రవర్తించడాన్ని ఇప్పటికే మనం ఎన్నో సార్లు చూశాం.అందుకే ఇలాంటి వారిని సమాజం కూడా వ్యతిరేకిస్తూ ఉంటుంది.
ఇకపోతే గతంలో పాణిపూరి తినే వారు కూడా ఇలాగే మురికి నీళ్లతో తయారు చేయడం మనం చూశాం.
మొన్నటికి మొన్న ఓ వ్యక్తి సమోసాలను నాకుతూ ప్యాక్ చేస్తున్న వీడియో నెట్టింట ఎంతలా వైరల్ అయిందో చూశాం.ఇప్పుడు కూడా ఇలాంటి వ్యక్తి గురించే తెలుసుకుందాం.
ఓ హోటల్లో ఓ వ్యక్తి తందూరి రోటీలు చేస్తున్న వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.అయితే ఇతగాడు సాధారణంగా రొట్టెలను ఓవెన్ లో వాటిని కాల్చే టైమ్లో నూను వాడాల్సి ఉంటుంది.
కానీ ఇతను మాత్రం అందుకు భిన్నంగా తన ఉమ్మును వేస్తూ తయారు చేస్తున్నట్టు కనిపిస్తుంది.ఈ హోటల్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ వెల్లే హైవే పక్కకు ఉన్నట్టు కనిపిస్తోంది.
ఈ దాబాలో పనిచేస్తున్న వ్యక్తి పిండి పిసుకుతూ రోటీలు తయారు చేస్తున్నాడు.అయితే ఓవెన్లో వేసేకంటే ముందు వాటి మీద నూనె వేస్తే ఇంకా టేస్టీగా తయారవుతుంటాయి.కానీ అతను మాత్రం నూనె వేయకుండా ప్రతిసారి తన ఉమ్మును వేస్తూ కాల్చతున్నట్టు ఇందులో కనిపిస్తుంది.దీన్నంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి కెమెరాలో వీడియో తీయగా అది కాస్త ఆవైరల్ కావడం స్టార్ట్ అయింది.
ఇంకేముంది దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్థానిక పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.అతనిమీద కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు.
.