ఈ ప్రపంచంలో చాలా రకాల వింత గ్రామాలు ఉంటాయి.అందులో ఇప్పుడు ఓ గ్రామం గురించి మనం చెప్పుకోబుతున్నాం.
ఈ గ్రామంలో వింత ఘటనలు చేసుకుంటున్నాయిని చెబుతున్నారు.అదేంటంటే ఈ గ్రామంలో పొరపాటున ఎవరైనా చనిపోతే అతన్ని కాల్చేయకముందే మరొకరు చనిపోవడం సంచలనాలకు తెర లేపుతోంది.
అయితే ఈ గ్రామంలో ఈ ఘటనలు వందల ఏండ్లుగా కొనసాగుతోందంట.అసలు ఈ ఊరిలో ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఈ ఊరిలో ఎవరైనా కన్నుమూస్తే ఆ రోజు చనిపోవడమో లేదంటే చాలా కొద్ది రోజుల్లోనే మరొకరు మరణిస్తున్నారంట.
ఇలా కీడు జరుగుతున్నందున ఈ ఊరి గ్రామస్తులు ఎన్నో శాంతి పూజలు చేయించారు.
కానీ ఈ విధమైన మరణాలు మాత్రం ఆగట్లేదని వాపోతున్నారు.అయితే ఈ వింత ఊరు మంచిర్యాల జిల్లాలో ఉన్న నెన్నెల గ్రామం గమనార్హం.
ఇక ఈ ఊరిలో ఎవరైనా చనిపోతే గనక తెల్లారితే ఎవరి వంతు వస్తుందో అనే భయం ఆ ఊరిని నిద్రపోనివ్వట్లేదు.అయితే ఈ గ్రామం ఏర్పడి ఇప్పటికి 500 ఏండ్లు అవుతుందట.
ఈ విధమైన వరుస చావుల వెనక ఉన్న మర్మం ఏమిలో అంతు పట్టటం లేదని ఎంత మందికి చూపించినా ఇది మాత్రం ఆగట్లేదని వెల్లడిస్తున్నారు.
ఇక హేతువాదుల లాంటివారు ఇది మూఢనమ్మకంగా భావించారు.కానీ వరుస మరణాలకు సాక్ష్యాలూ, ఆధారాలు కూడా చూపించడంతో నమ్మక తప్పట్లేదు.పోనీ ఊరికి వాస్తుపరంగా ఏదైనా దోషాలు ఉన్నాయని, దేశంలో ప్రముఖులైన వేద పండితులతో కూడా ఎన్నో పూజలు చేయించారు.
కానీ ఆ ఊరికి పట్టిన మహమ్మారి మాత్రం వదలట్లేదు.ఏ క్షణం ఎవరి ఇంట్లో చావు డప్పుడు మోగుతాయో ఎవరికీ అర్థం కావట్లేదు.పంచాయతీ మరణ ధ్రువీకరణ బుక్కులో ఈ విధమైన జంట మరణాలు కనిపిస్తున్నాయి.ఒక వ్యక్తి చనిపోయిన 24 గంటల వ్యవధిలో లేదంటో వారం వ్యవధిలో చనిపోతున్నారట.
.