సోషల్ మీడియా వినియోగంలోకి వచ్చిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక వింతలూ – విశేషాలను మనం యిట్టె తెలుసుకోగలుగుతున్నాము.అందులో కొన్ని వింతగా ఉంటే, మరికొన్ని ఫన్నీగా ఉంటాయి.
ఇంకొన్ని చాలా ఎమోషనల్ గా ఉంటాయి.ఈమధ్యకాలంలో ఫుడ్ విషయంలో కూడా పోటీలు జరుగుతున్న సంఘటనలు మనం అనేకం చూశాం.
నిర్ణీత సమయంలో నిర్వాహకులు ఇచ్చిన ఆహారాన్ని తినగలిగితే ఉచించని బహుమతి సొంతమవుతుంది.అయితే అది అంత సులువు కాదు.
కానీ ఫుడ్ లవర్స్ అయితే అది అంత కష్టం కాదని చెప్పడం కొంచెం వింతగానే ఉంటుంది.
ఇపుడు అలాంటి ఓ యువకుడి గురించి తెలుసుకుందాం.
రజనీష్ అనే యూట్యూబర్ అలాంటి సవాలును స్వీకరించి భారీ బహుమతి గెలుచుకున్నాడు.వివరాల్లోకి వెళితే… ఢిల్లీలోని చోలే కుల్చా రెస్టారెంట్ యాజమాన్యం తరచుగా ఫుడ్ ఛాలెంజ్లను నిర్వహిస్తుంటుంది.
ఆ ఛాలెంజ్లో పాల్గొనే వ్యక్తి అరగంటలో 21 ప్లేట్ల మటర్ కుల్చే తినాలి.అందులో పాల్గొని ఎవరైనా ఛాలెంజ్ని పూర్తి చేస్తే, రెస్టారెంట్ వారు స్పాట్ లో రూ.50,000 నగదు బహుమతి ప్రసాదిస్తారు.ఇక ఆ పోటీలో పాల్గొన్న వ్యక్తి గెలవలేని పక్షంలో రూ.2,100 బిల్లు చెల్లించాలి.
అయితే, తాజాగా వారు మరో ఫుడ్ ఛాలెంజ్ పెట్టారు.ఆ ఛాలెంజ్లో నగదు బహుమతికి బదులుగా 1.48 లక్షల విలువైన బుల్లెట్ను బహుమతిగా ప్రకటించారు.రజనీష్ అనే వ్యక్తి ఆ ఛాలెంజ్లో పాల్గొని తను తింటున్నది అరగడానికి మధ్యలో 6 నుంచి 7 గ్లాసుల లస్సీ కూడా గటగటా తాగేశాడు.అలాగే మధ్య మధ్యలో గెంతడం, వ్యాయామాలు చేయడం వంటివి కూడా చేయడం కొసమెరుపు.
మొత్తానికి అరగంటలో 21 ప్లేట్ల చోలే కుల్చా తినేసి రెస్టారెంట్ యజమానిని ఆశ్చర్యపోయేలా చేసాడు.దాంతో బుల్లెట్ గెలుచుకున్నాడు.