కొన్ని సార్లు అంతే.ఏమీ లేదనుకుంటాం గానీ ప్రతి దానికి ఓ చరిత్ర ఉంటుంది.
చూడటానికి అక్కడ మనకు ఏమీ కనిపించకపోవచ్చు గానీ దాని టైమ్ వచ్చిందంటే దాని విలువ ఏంటో బయటపడుతుంది.ఈ మాట ఆస్తులకు మాగా వర్తిస్తుందేమో అనిపిస్తుంది.
ఎందుకంటే మనం ఏమీ లేదనుకున్న భూముల విలువ కూడా ఒకేసారి కోట్లకు పెరుగుతుంది.అలాగే కొన్ని చోట్ల బిల్డింగులు కూడా ఎందుకూ పనికి రావనుకునే టైమ్లోనే అనూహ్య రేటు వస్తుంది.
అలాగే ఇప్పుడు ఓ గుడిసెకు కూడా టైమ్ వచ్చినట్టు ఉంది.
రియల్ ఎస్టేట్లో ఎక్కడ మంచి డిమాండ్ ఉంటే అక్కడి భూములకు అమాంతం రేట్లు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం.
యూకేలోని వేల్స్ స్నోడోనియాలో ఇప్పుడు ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.అదేంటంటే ఇక్కడ ఉండే ఓ గుడిసెకు విపరీతమైన డిమాండ్ వస్తోంది.ఈ గుడిసెను పర్యాటకులు ఎంతో ఇష్టపడుతున్నారు.ఇక్కడ ఉంటే పక్కనే సరస్సు అలాగే ఇంకో పక్కన పర్వత శిఖరాల సహజ సౌందర్యాన్ని చాలా దగ్గరి నుంచి చూసే అవకాశం కలుగుతుంది.చాలా చిన్న స్థలంలో కట్టిన ఈ గుడిసె ధర మన కరెన్సీలో రూ.36 లక్షలు.
ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ గుడిసెలో కనీసం టాయిలెట్ కూడా లేదు.కానీ లక్షల్లో ధరలు పలుకుతోంది.ఈ గుడిసె పైకి సుందరంగానే ఉంది.ఇందులోకి వెళ్తే మాత్రం హాలు పెద్దగా ఉంటుంది.కాగా ఇందులో రెండు సోఫాలు అరేంజ్చేశారు.అలాగే లోపల బెడ్రూమ్ కూడా అందంగానే ఉంటుంది.ఇలా రెండు రూములు మాత్రమే ఇందులో ఉంటాయి.ఇంకే రూము కూడా ఇందులో ఉండదు. కనీసం టాయిలెట్ లేకపోయినా కూడా దీనికి ఈ రేంజ్లో రేటు రావడం చూసి అందరూ షాక్ అయిపోతున్నారు.మరి ప్రకృతిని దగ్గరి నుంచి చూడాలంటే ఈ మాత్రం పెట్టాలంటున్నారు నెటిజన్లు.