బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అప్పటి నుండి వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాను యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో పాటుగా మరొక రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
ఈ సినిమాతో పాటు సలార్, ఆది పురుష్ సినిమాలు కూడా అనౌన్స్ చేసాడు.
రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.
ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే తాజాగా ఈ సినిమాలో ఎనిమిది సంవత్సరాల క్రితం మంచు మనోజ్ సినిమా కేటుగాడులో హీరోయిన్ గా నటించిన భామ ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్నట్టు ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.
ఆ బ్యూటీ పేరు సిమ్రాన్ కౌర్ ముంది.ఈమె కేటుగాడు సినిమా చేసి మళ్ళీ టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది.ఈ సినిమాలో కేవలం ఒక్క సీన్ మాత్రమే ఉంటుందట.
కానీ ఈమె పాత్ర చాలా బాగుంటుందని ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.అయితే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
అయితే ప్రభాస్ ఈ సినిమాను పూర్తి చేసుకుని జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.దీంతో పాటుగా సలార్, ఆది పురుష్ సినిమా షూటింగ్ లు కూడా ప్రారంభించేసారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ తెరకెక్కుతుండగా.ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా తెరకెక్కుతుంది.
ఆది పురుష్ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఆగస్టు 11 2022 విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.