క్రికెట్ మన భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన క్రీడల్లో ఒకటిగా చెప్పవచ్చు.క్రికెట్ ను ఎంతగానో ప్రేమిస్తారో, క్రికెటర్లను అంతలా అభిమానిస్తారు.
ఎంతలా అభిమానిస్తారంటే వారిని దేవుళ్ళలా చూస్తారు.ఇక సాధారణ అభిమానుల పరిస్థితి ఇలా ఉంటే ఆ అభిమానుల నుండి పుట్టిన క్రికెటర్లకు క్రికెట్ మీద, వారి అభిమాన క్రికెటర్ మీద ఎంతో అభిమానం ఉంటుంది.
వారిని కలిసి ఒక ఫోటో తీసుకోవాలని, వారి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కలలుగంటారు.కాని వారిని కలిసే అవకాశం చాలా కొద్ది మందికే దక్కుతుంది.
ఇక వారిని కలిసిన వారు ఆటోగ్రాఫ్, తీసుకోని వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని గొప్ప క్రికెటర్ గా ఎదగడంలో ఇవి కీలకపాత్రను పోషిస్తాయి.
అలా తమ అభిమాన క్రికెటర్ ఆటోగ్రాఫ్ తీసుకొని గొప్ప క్రికెటర్స్ గా ఎదిగిన వారు ఇండియన్ క్రికెటర్స్ లోనే ఉన్నారు.
వారెవరంటే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, క్రికెటర్ రిషబ్ పంత్.వీరు ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్ తీసుకుంటున్న ఫోటోలు తీసుకొని ఇప్పుడు గొప్ప క్రికెటర్స్ గా ఎదిగారు.అయితే ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్ తో స్టార్ క్రికెటర్లుగా మారుతున్నారని, స్టార్ క్రికెటర్స్ గా ఆవాలనుకునే వారు ఆశిష్ నెహ్రా ఆటోగ్రాఫ్ తీసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.