పెళ్లి అయి కొన్ని ఏళ్లు అయినా సంతానం కలగపోతే ఎవరైనా ఏం చేస్తారు వెళ్లి డాక్టర్లను కలుస్తారు.వారు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించడంతో పాటు మందులు కూడా వాడతారు.
ఇలా డాక్టర్లు చెప్పినట్టు చేస్తే కొందరికి పిల్లలు పుడతారు.అలాగే కొందరికి కొన్ని రకాల సర్జరీలు అవసరం పడతాయి.
సంతానం కోసం వాటిని కూడా చేయించుంటారు భార్యాభర్తలు.అయితే పాపం కొందరికి మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత మంది డాక్టర్ల వద్ద చూపించుకున్నా ఆపరేషన్లు చేసుకున్నా పిల్లలు కలగరు.
ఇగ అప్పుడు అధ్యాత్మిక మార్గంవైపు వస్తారు.
కొన్ని సార్లు అవి కూడా సత్ఫలితాలను ఇస్తాయి.
ఇలాంటి ఓ మార్గం గురించి ఇప్పుడు కొందరు చర్చింకుంటున్నారు.ఓ ఆలయంలో దొంగతనం చేస్తే సంతానం కలుగుతుందని ప్రచారంలోకి వస్తోంది.
సాధారణంగా ఏ ఆలయంలో దొంగ తనం చేయడానికి ఆలయ సిబ్బందిగానీ, పాలక వర్గంగానీ, భక్తులు గానీ ఒప్పుకోరు.ఏ ఆలయానికైనా పకడ్బందీ సెక్యూరిటీ ఉంటుంది.
సీసీ కెమెరాలు, సిబ్బంది ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు.కానీ ఆ ఆలయంలో మాత్రం దొంగతనం చేస్తే ఎవరూ ఏమీ అనరు.
పైగా ప్రోత్సహిస్తారు కూడా.అక్కడ పని చేస్తే పంతుళ్లు కూడా దొంగతనం చేయాలని సూచిస్తారట.
దొంగతనం అంటే మరీ అదేదో బంగారం, వెండి, ఇతర వస్తువులు అనుకుంటే పొరపాటే.కేవలం అమ్మవారి పాదాల దగ్గర ఉన్న చెక్కతో తయారు చేసిన బొమ్మను దొంగతనం చేయాల్సి ఉంటుంది.ఇలా చేసిన చాలా మందికి సంతానం కలిగిందని ఇక్కడ చెప్పుకుంటారు.ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉందా ? అయితే పదండి.ఇక్కడికి వెళ్లాలంటే ఉత్తరాఖాండ్ కు చేరుకోవాల్సి ఉంటుంది.ఆ రాష్ట్రంలోని రూర్కీలోని చూడియాల ప్రాంతంలో ఉందీ దేవాలయం.
ఆ గ్రామంలో ఉన్న చూడామణి దేవాలయం ఎంతో పురాతనమైనది.ఈ దేవాలయాన్ని దర్శించి, అమ్మావారి పాదల వద్ద ఉన్న చెక్క బొమ్మను దొంగతనం చేస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం.
అయితే సంతానం కలిగిన వెంటనే ఆ చెక్క బొమ్మతో పాటు మరో చెక్క బొమ్మను తయారు చేయించి ఆ గుడిలో అమ్మవారి చెంత ఉంచాలట.బాగుంది కదా.ఎంతో మంది తల్లిదండ్రుల ఆశల కోరికను నెరవేరుస్తున్న అమ్మవారికి చాలా మహిమలున్నాయని భక్తుల నమ్మకం.