మన దేశంలో పర్యాటక ప్రాంతాలకు కొదవలేదు.పర్యాటక ప్రాంతాలకు ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.
అయితే ఒక్కో పర్యాటక ప్రాంతానికి ఒక్కో గొప్ప విశిష్టత ఉంటుంది.అయితే చాలా రకాల పర్యాటక ప్రాంతాలలో మనం విదేశీ పర్యాటకులను చూసి ఉంటాం.
చూసి ఆనందిస్తాం కూడా.కాని మనం ఇప్పుడు చెప్పుకోబోయే పర్యాటక ప్రాంతం చాలా ప్రత్యేక మైనదని చెప్పవచ్చు.
అయితే సహజంగా మనుషులు మాత్రమే ఇష్టపడి వెళ్లే పర్యాటక ప్రదేశాలను మనం చూసాం.కాని పక్షులు అందులో విదేశీ పక్షులు ఏకంగా ఆ పర్యాటక ప్రాంతాన్ని నిలయంగా మార్చుకున్న పరిస్థితి ఉంది.
ఆ ప్రాంతమే శ్రీకాకులం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురానికి వచ్చి విడిది చేస్తాయి.ప్రతి సంవత్సరం నైజీరియా దేశం నుండి పెలికాన్ వంటి పక్షి జాతులు ఇక్కడ సందడి చేస్తాయి.ఇప్పుడు వీటిని చూడటానికి ఇప్పుడు పర్యాటకులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.విదేశీ పక్షుల రాక కారణంగా తేలినీలాపురం మంచి పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.అయితే వీటి పట్ల గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం, ఫారెస్ట్ అధికారులు కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుండటంతో దీన్ని మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే డిమాండ్ వినిపిస్తోంది.