ఒక రోడ్డు ప్రమాదం ఒక కుటుంబాన్ని రోడ్డుమీదకు తెస్తుంది.ఎప్పుడు ఎక్క్కడి నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో ఎవరమూ చెప్పలేం.
ఇక ఇప్పుడు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎంత ఘోరంగా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం.అందుకే బైక్పై ప్రయాణం చేసే టప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలి అని పెద్దలు అందుకే చెప్తుంటారు.
కాకపోతే మనం వినకుండా అనవసర ప్రయోగాలకు వెళ్తుంటాం.చివరకు జీవితాల మీదకు తెచ్చుకుంటాం.
ఇక ఇలా ఏ తప్పు చేయకపోయినా కూడా ప్రమాదాలకు గురవుతున్నారు చాలామంది.
ఈ భూ ప్రపంచంలో ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు జరుగడం చాలా కామన్.
ఇక ఈ ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు మనం చూసినప్పుడు మనసు కలిచివేస్తుందనే చెప్పాలి.అయితే ఇలాంటి ఘటనే ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.రీసెంట్ గా ఓ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు చాలా స్పీడ్ గా నడుపుతూ తమకు ఎదురుగా వెళ్తున్న ఇద్దరు బైక్ రైడర్లను ఢీకొట్టిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.అయితే అతను అలా బైక్ను ఢీకొట్టిన తర్వాత ఏమాత్రం ఆగకుండా చాలా స్పీడ్గా కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం తీవ్రంగా కలిచివేస్తోంది.
అయితే ఇప్పుడు ఈ ఈడియో కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవడంతో చాలామంది దీనిపై స్పందిస్తున్నారు.అయితే ఈ ఘటన తమిళనాడులో జరిగిందని తెలుస్తోంది.ఈ రాష్టరంలోని సేలం జిల్లాలో గల జాతీయ రహదారిపై కల్లకూరిచి ప్రాంతం నుంచి ఇద్దరు వ్యక్తులు తమ బైక్పై వారి ఊరికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.వారి వెనకాలే వేగంగా వచ్చిన కారు డ్రైవర్ ఏ మాత్రం వారిని పట్టించుకోకుండా వారిని ఢీ కొట్టేసి చాలా రూడ్గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బలంగా ఢీ కొట్టడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ఎగిరి ఎగిరిపడి తీవ్రంగా గాయాలపాలవుతారు.