రెండు రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాల నుండి తిరుమల అర్థరాత్రి నుండే కుదుటపడింది.బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈ రెండు రోజులు ఏకథాటిగా కురిసిన వర్షపాతానికి తిరుమల గిరులు జలమయం అయ్యాయి.
రెండు ఘాట్ రోడ్లుతో సహా తిరుమల అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.
రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకూ తిరుమల – తిరుపతి ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని మూసివేశారు టిటిడి అధికారులు.
ఇక తిరుమల కొండపై వున్న అన్ని మార్గాలు జలమయం కాగ జలాశయాలు నిండిపోయాయి.దీంతో తిరుమలలో వున్న పాపవినాశనం,గోగర్భం డ్యాం గేట్లను ఎత్తి వేశారు అధికారులు.
ఆకాశగంగ,కుమారధార పసుపుధార జలాశయాల నుంచి నీరు ఒవర్ ప్లో అవుతుంది.