సినిమాల్లో 30 ఇయర్స్ పృథ్వీ బ్రహ్మానందం తర్వాత ఆ స్థాయిలో నిలిచిన విషయం తెల్సిందే.కమెడియన్గా మాంచి ఫామ్లో ఉన్న సమయంలోనే వైకాపా జెండా పట్టుకున్నాడు.
జగన్ వెంట నడిచాడు.వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మంచి మనసుతో పృథ్వీకి టీటీడీ భక్తి ఛానెల్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం జరిగింది.
అధికార పార్టీ అండదండలతో ఇండస్ట్రీకి చెందిన వారిపై పృథ్వీ కామెంట్స్ చేయడం మొదలు పెట్టాడు.దాంతో ఆయన సినిమాలకు దూరం అయ్యాడు.
ఇండస్ట్రీలో ఈమద్య ఆయనకు అసలు ఆఫర్లే కరువయ్యాయి.అయినా కూడా పదవి ఉంది కదా అని నిశ్చింతగా ఉన్నాడు.కాని ఆమద్య అమరావతి రైతులపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరియు ఫోన్ సంభాషణలు బయటకు రావడంతో చైర్మన్ పదవి పోయింది.ఇదే సమయంలో ఆయనకు ఇండస్ట్రీలో కూడా చెడ్డ పేరు వచ్చింది.
దాంతో పృథ్వీ రెంటికి చెడ్డ రేవడి పరిస్థితి అయ్యింది.రాజకీయ జీవితం నాశనం అయ్యింది.
అలాగే సినిమా కెరీర్ ఇప్పటికే ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది.ఈ పరిస్థితుల్లో పృథ్వీ ఏం చేస్తాడో చూడాలి.