నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ ఇటీవల నేరుగా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కాగా, దానికి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.కాగా ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.
ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్లో పెడుతూ దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే ‘టక్ జగదీష్’ చిత్ర షూటింగ్లో నాని పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా పూర్తికాక ముందే తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.‘శ్యామ్ సింఘ రాయ్’ అనే టైటిల్తో రాబోతున్న ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్లుగా అందాల భామ సాయి పల్లవితో పాటు ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.అయితే ఈ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్ను కూడా ఓకే చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మూడో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఇందులో మూడో హీరోయిన్గా అందాల భామ నివేదా థామస్ లేదా అదితి రావు హైదరీని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
ఇప్పటికే నాని ‘వి’ చిత్రంలో ఈ ఇద్దరు బ్యూటీలు కలిసి నటించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మరోసారి వారిలో ఒకరిని శ్యామ్ సింఘ రాయ్ చిత్రంలో తీసుకుని నానితో వారి ట్రాక్ను కంటిన్యూ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది.
ఇక పూర్తిస్థాయి ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ తీర్చిదిద్దుతుండగా, ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.జనవరిలో ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.