టర్కీ, సిరియా దేశాలలో వరుసగా వస్తున్న భారీ భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.శిథిలాల కింద చాలామంది ఇరుక్కుపోయి ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు.ఉదయం అందరూ నిద్రలో ఉండగా 7.8 తీవ్రతతో తొలి భూకంపం సంభవించింది.ఆ తర్వాత మధ్యాహ్నం 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది.ఈ క్రమంలో సహాయక చర్యలు చేపడుతూ ఉండగా సాయంత్రం 6.0 తీవ్రతతో మూడో భూకంపం రావడం జరిగింది.ఈ భూకంపా కేంద్రం సెంట్రల్ టర్కీలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
దాదాపు 12 గంటల వ్యవధిలో మూడు భారీ భూకంపాలు సంభవించడంతో… ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయాందోళన చెందుతున్నారు.
ఇప్పటిదాకా 1600 మంది ప్రాణాలు విడువగా శిథిలాల కింద మరి కొంతమంది చిక్కుకుపోయి ఉన్నారు.మృతుల సంఖ్య 5వేలకు చేరవచ్చని నిపుణులు చెప్పుకొస్తున్నారు.సిరియా.టర్కీ దేశాలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇజ్రాయిల్ ఇంకా లేబనన్ వంటి దేశాల ప్రజలు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు.
ఇక ఇదే సమయంలో.టర్కీ దేశంలో భారీ ఎత్తున ప్రాణా నష్టం ఉండటంతో భారత్ తో పాటు ఇజ్రాయిల్ మరికొన్ని దేశాలు.
సహాయక బృందాలను పంపిస్తున్నాయి.