టాలీవూడ్ లో విభిన్న చిత్రాలతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు సత్య దేవ్.ఈయన వరస సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.
కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ వాయిదా పడ్డ మళ్ళీ ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసు కుంటున్నాడు.ఈయన చివరి సినిమా ”ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య”.ఈ సినిమా ఓటిటీ లో రిలీజ్ అయినా కూడా హిట్ టాక్ రావడంతో మరింత ఇమేజ్ సొంతం చేసుకున్నాడు సత్య దేవ్.దాంతో అవకాశాలు కూడా పుష్కలంగా వచ్చాయి.
ప్రస్తుతం సత్య దేవ్ శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.తిమ్మరుసు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై కూడా ముందు నుండే మంచి అంచనాలు పెరిగాయి.
తన ఇమేజ్ తో తీస్తున్న ప్రతి సినిమాకు కూడా బాగా హైప్ వస్తుంది.ప్రమోషన్స్ కూడా బాగా జరుగుతుండడంతో సత్య దేవ్ సినిమాలు ప్రేక్షకులకు రీచ్ అవుతున్నాయి.
స్టోరీ నచ్చితే ఏ సినిమా అయినా ఆదరించడానికి మన టాలీవుడ్ ప్రేక్షకులు ముందు వరుసలో ఉంటారు.కాబట్టి తిమ్మరుసు సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా తిమ్మరుసు సినిమా ట్రైలర్ విడుదల కాబోతుంది.ఈ ట్రైలర్ ను జులై 26 సాయంత్రం 4 గంటల 50 నిముషాలకు విడుదల చేయబోతున్నట్టు నిర్మాత కోనేరు మహేష్ తెలిపాడు.ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడానికి ఒప్పుకున్నందుకు ఎన్టీఆర్ కు మహేష్ కోనేరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.