తెలుగు సినిమా పరిశ్రమ అన్ని విషయాల్లో కూడా చాలా అడ్వాన్స్ గా ఉంటుంది అనడంలో సందేహం లేదు.గత ఏడాది లాక్ డౌన్ ముగించిన తర్వాత ఎక్కువ సినిమాలు టాలీవుడ్ నుండి వచ్చాయి.
చిన్నవి పెద్దవి కలిపి చాలా సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.చాలా సినిమాలు షూటింగ్ లు పూర్తి చేసుకున్ని ఉన్నాయి.
కనుక వెంట వెంటనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి.ఇక పెద్ద సినిమాలు కూడా భారీ ఎత్తున విడుదల అవుతాయి అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ థియేటర్లు మూత పడ్డాయి.
గత ఏడాది ఇతర భాషల్లో విడుదల అయిన సినిమాలు పదికి తక్కువే.కాని తెలుగు లో మాత్రం చాలా సినిమాలు విడుదల అయ్యాయి.
టాలీవుడ్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మళ్లీ మొదలు కాబోతున్నాయి.సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ లు ముగిసిన సినిమాలను నిన్నటి నుండి వరుసగా విడుదల చేయబోతున్నారు.
సెకండ్ వేవ్ కారణంగా మూడు నెలల పాటు థియేటర్లు మూత పడ్డాయి.ఎట్టకేలకు సినిమా లు విడుదల అయిన నేపథ్యంలో అభిమానులు మళ్లీ సినిమాల థియేటర్ల వెంట పరుగులు తీస్తున్నారు.
నిన్న తిమ్మరుసు సినిమా మరియు ఇష్క్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ రెండు సినిమాల్లో తిమ్మరుసు మరియు ఇష్క్ లు భారీ ఎత్తున అంచనాలను మోసుకు వచ్చాయి.
దాంతో ఈ సినిమాలకు భారీగా ఓపెనింగ్స్ ఉంటాయని అంతా భావించారు.కాని నిరాశ తప్పలేదు.తిమ్మరుసు మొదటి రోజు 14.5 లక్షల షేర్ ను దక్కించుకోగా ఇష్క్ సినిమా 15 లక్షల షేర్ ను సొంతం చేసుకుంది.ఈ రెండు సినిమాలు శని ఆదివారాల్లో ఎక్కువగా వసూళ్లను దక్కించుకుంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు.
మరి ఈ సినిమా ల లాంగ్ రన్ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చూడాలి.