మృత్యువు ఏ రూపంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు.ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.
చాలా బలంగా ఉన్న మనిషి.చనిపోతున్న రోజులలో సమాజం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే దురదృష్టవశాత్తు తల్లికి సహాయంగా బట్టలు ఉతకడానికి వెళ్లిన ఇద్దరు నదిలో గల్లంతయ్యారు. వేసవి సెలవులు( Summer Holidays ) కావడంతో నక్కపల్లి మండలం పోతిరెడ్డి పాలెం చెందిన పిల్లి లక్ష్మి తన కుమారుడు అనిల్ (17), మేనల్లుడు ఏడ్డాడ ప్రసాద్ (17)ను తీసుకుని వారం రోజుల క్రితం కాసింకోట మండలం వెదురువాడకు చెందిన బావ ఇంటికి వెళ్లడం జరిగింది.
అయితే అక్కడ తమతో తెచ్చుకున్న బట్టలు మాసిపోవటంతో ఉతకటానికి శారదా నది వద్దకు వెళ్లారు.ఈ క్రమంలో లక్ష్మీ బట్టలు ఉతుకుతుండగా కొడుకు, మేనల్లుడు సరదాగా నదిలో ఈతకు దిగారు.
అయితే ప్రమాదవశాత్తు వారిద్దరూ నీటిలో గల్లంతైపోయారు.అది గమనించిన లక్ష్మి చుట్టుపక్కల వారిని పిలిచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
అప్పటికే వాళ్ళిద్దరూ నీటిలో కొట్టుకుపోయారు.దీంతో వారికోసం గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి ఇప్పుడు… గాలిస్తున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అనకాపల్లి జిల్లా( Anakapalli ) కాసింకోట మండలం వెదురువాడలో జరిగిన ఈ ఘటన అందరిని కలిచి వేసింది.
ఎలాగైనా ఆ రెండు ప్రాణాలను కాపాడటానికి గజ ఈతగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు.