సినీ పరిశ్రమలో పరిచయం కు ముందు ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటారు నటీనటులు.ఆ అవమానాలనే ఆయుధం గా చేసుకొని మొత్తానికి సినిమా పరిశ్రమలో చోటు దక్కించుకుంటారు.
ఇలా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా నటులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోగా.ఇటీవలే బాలీవుడ్ నటి దీపికా తన నటనని చూసి నవ్వారంటున్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంది.
19 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన మోస్ట్ గ్లామరస్ కన్నడ బ్యూటీ దీపిక పదుకొనె.తను ఓ మోడల్.2006 కన్నడ చిత్రం లో పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్ లో 2007 లో ” ఓం శాంతి ఓం” సినిమాలో నటించింది.ఆ సినిమా షూటింగ్ తొలిరోజుల్లో తను చాలా అవమానాలు ఎదుర్కొంది.
మొదట్లో తన నటనను చూసి ఎగతాళి చేసిన వాళ్లు చాలామంది ఉన్నారని ఇటీవలే తెలిపింది.“ఆ సినిమాలో నటనకు, భాషకు ఎంతో ఇబ్బంది కాగా కొందరు చాలా నవ్వుకునేవాళ్ళు.కానీ అవన్నీ పట్టించుకుంటుపోతే లక్ష్యం అక్కడే ఆగిపోతుందని తెలుసుకొని.ఆ అవమానంనే ఆయుధం గా మార్చుకున్నాను.పట్టుదలతో నా వంతు ప్రయత్నం చేశాను” అని దీపిక చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉంటే దీపిక 2018లో రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ కన్నడ బ్యూటీకి టాలీవుడ్ లో హీరో ప్రభాస్ సరసన అవకాశం రాగా దానిని వదులుకుంది.హీరో ప్రభాస్.
ప్రస్తుతం ఆయన రేంజ్ బాలీవుడ్ హీరోలను దాటాడు.కానీ ఈ ముద్దుగుమ్మ మంచి అవకాశాన్ని వదులుకోగా మరో బాలీవుడ్ నటి కి ప్రభాస్ పక్కన అవకాశం దక్కింది.
ప్రభాస్ నటించే సినిమా లో ఈ భామ వద్దనడానికి కారణం.
తనకు రెమ్యూనరేషన్ తక్కువగా ఉందని తెలిపింది.దీపికాకు సౌత్ సినిమాలో అవకాశం రాగా.కథ వినకుండానే నో అని చెప్పేది.
కారణం రెమ్యూనరేషన్ విషయంలో ఆమెకు నచ్చకపోవడం.ఈ బ్యూటీ తన అందాన్ని పెంచుకుంటూ.
ప్రతి సినిమాకు రెమ్యూనరేషన్ ను పెంచుకుంటూపోతుంది.కాగా ప్రస్తుతం కపిల్ దేవ్ బయోపిక్ లో హీరోయిన్ గా నటిస్తుంది.
అందులో తన భర్త రణ్ వీర్ హీరోగా నటిస్తున్నాడు.