చాలా మందికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం.జంతువులను పెంచుకునే అలవాటు చాలా వరకు అందరికీ ఇష్టమే.
వాటికి ఏమైనా హాని కలిగితే తట్టుకోలేక ఆందోళన చెందుతారు.కాగా వాటికి పుట్టినరోజు వేడుకలు వంటివి జరుపుతుంటారు.
ఇటీవలే ఓ దంపతులు తమ పెంపుడు పిల్లి కి సీమంతం చేసిన సంగతి తెలిసిందే.కాగా ఇటీవల గోమాతకు సీమంతం చేసిన విషయం అందరినీ ఆకట్టుకుంది.
వరంగల్ జిల్లా, హనుమకొండ లో ఎస్ బీ హెచ్ కాలనీ లో పీ జే ఆర్ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న వీరేశం, శోభ అనే దంపతులు.వీళ్లకు నలుగురు కొడుకులు.
ఆడపిల్ల లేనందున గోమాతను పెంచుకుంటున్నారు.వీరేశం నెల రోజుల క్రితం 30,000 పెట్టి ఆ ఆవును కొనుక్కొచ్చాడు.
ఆవు నివసించడానికి తమ ఇంటి పక్కన ఖాళీ స్థలాన్ని కూడా కొన్నాడు వీరేశం.ఆ చుట్టుపక్కల ఉన్న సభ్యులంతా వారానికొకసారి ఆవు కు ఆహారపదార్థాలు అందిస్తుంటారు.
దీంతో ఇటీవల అది గర్భం దాల్చింది.ఇక ఆ కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకపోయాయి.
దీంతో తమ చుట్టుపక్కల ఉన్న సభ్యులంతా వీరేశం కు ఆవుకు సీమంతం చేయాలని తెలిపారు.దీంతో వెంటనే వాళ్ళు తమకు ఆడపిల్లలు లేనందున ఈ ఆవు ద్వారా ఆడపిల్ల లేని లోటు తీర్చుకోవాలనుకున్నారు.
మా ఆవిడే మాకు ఆడబిడ్డ లాంటిది అంటూ ఆడపిల్ల ఉంటే తనకు ఇలాంటి వేడుక ఎలా చేస్తామో అలాగే ఈ ఆవు కూడా చేయాలనుకున్నారు ఆ కుటుంబం.వెంటనే ఆ కాలనీ చుట్టుపక్కల ఉన్న సభ్యుల సమక్షంలో ఆ కుటుంబం పూజారిని పిలిపించి తెలుగువారి సాంప్రదాయ పద్ధతిలో పువ్వులు, పండ్లు, గాజులు తదితర వస్తువులతో ఆవుకు ఘనంగా సీమంతం వేడుకలు జరిపించారు.
.