శ్రీజ కొణిదెల ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.చిరంజీవి చిన్న కూతురుగా అందరికీ సుపరిచితమైన శ్రీజ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు.
ఇలా శ్రీజ వార్తల్లో నిలవడానికి గల కారణం ఆమె తన భర్త పేరును తొలగించి శ్రీజ కొణిదల అనే పేరును పెట్టుకోవడమే కారణం.ఎప్పుడైతే శ్రీజ తన భర్త పేరు కళ్యాణ్ దేవ్ ను తొలగించి తన ఇంటి పేరును పెట్టుకున్నారో అప్పటి నుంచి వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని పెద్దఎత్తున వార్తలు షికార్లు చేశాయి.
ఈ క్రమంలోనే వీరిద్దరీ గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై ఇటు మెగా కుటుంబం కానీ, అటు కళ్యాణ్ దేవ్ కానీ ఈ వార్తలపై స్పందించలేదు.అయితే వీరిద్దరూ విడిగా ఉంటున్నారు అనే విషయం పూర్తిగా అర్థమవుతుంది.
ఇలా వీరి గురించి ఎన్నో వార్తలు వస్తున్న నేపథ్యంలో శ్రీజ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఏ ఒక్క పోస్ట్ చేసిన అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది.తాజాగా శ్రీజ మరొక పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
శ్రీజ, కళ్యాణ్ విడిపోతున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ శ్రీజ కళ్యాణ్ కుమార్తె నవిష్క ఎవరి దగ్గర ఉందనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.అయితే తాజాగా శ్రీజ చేసిన పోస్టు చూస్తే మాత్రం తన ఇద్దరు కూతుర్లు తన వద్దనే ఉన్నారని అర్థమవుతోంది.ఇక తన ఇద్దరు కూతుర్లతో శ్రీజ సెల్ఫీకి ఫోజులిస్తూ తన ఇద్దరు కూతుర్లు తన ప్రపంచం అంటూ చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.