ఇటీవల తాడేపల్లి ప్రాంతం పైగా సీఎం జగన్ ఇంటికి దగ్గర్లోనే అత్యాచార ఘటన జరగటంతో ఏపీ ప్రభుత్వం ఆ కేసు చాలా సీరియస్ గా టేకప్ చేస్తుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేయడం మాత్రమే కాకా కొంతమంది అనుమానితులను ఆదుపులోకి తీసుకోవడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉండగా రాష్ట్రంలో మహిళా భద్రత విషయంలో.సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు.
ఈ క్రమంలో.వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శులు కూడా ఇకపై పోలీసుశాఖలో అంతర్భాగం అని స్పష్టం చేశారు.మహిళా పోలీసులు నిర్వహించే విధులు కూడా రాబోయే రోజుల్లో వీరి చేత నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ మేరకు పోలీసు యూనిఫామ్ కూడా వీరికి ఇవ్వనుంది.
అంతే కాకుండా మహిళా పోలీస్ స్టేషన్ లలో కానిస్టేబుల్స్ గా పనిచేసే వారికీ వర్తించే రూల్స్ వీరికి కూడా వర్తించనున్నాయి.