సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటే పాత్రల కోసం తమ లుక్ ను హీరోలు, హీరోయిన్లు మార్చుకోవాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే.కొన్నిసార్లు పాత్రల కోసం బరువు పెరగాల్సిన పరిస్థితి పెరుగుతుంది.
అలా పాత్రల కోసం బరువు పెరిగిన హీరోయిన్ల జాబితాలో స్టార్ హీరోయిన్ అనుష్క ముందువరసలో ఉన్నారు.సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క బరువు తగ్గడం కోసం ఇప్పటికీ కష్టపడుతున్న సంగతి తెలిసిందే.
స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆంగ్లో ఇండియన్ మూవీ కొరకు పది సంవత్సరాల క్రితమే బరువు పెరిగారు.సెవెన్ ఖూన్ మాఫ్ అనే సినిమా కొరకు కేవలం మూడు నెలలలోనే ప్రియాంక చోప్రా లావెక్కడం గమనార్హం.
బాలీవుడ్ హీరోయిన్ భూమి ఫడ్నేకర్ కూడా పాత్ర కొరకు బొద్దుగా మారిన హీరోయిన్ల జాబితాలో ఉన్నారు.మరో హీరోయిన్ విద్యా బాలన్ డర్టీ పిక్చర్ సినిమా కొరకు బరువు పెరిగారు.
సాధారణంగా బొద్దుగా ఉండే విద్యాబాలన్ ఈ సినిమా కోసం ఏకంగా 12 కేజీల బరువు పెరిగినట్లు తెలుస్తోంది.మిమి అనే సినిమా కొరకు బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ బరువు పెరిగారు.ఈ బ్యూటీ పాత్ర కొరకు ఏకంగా 15 కేజీల బరువు పెరిగినట్టు తెలుస్తోంది.బాలీవుడ్ ఇండస్ట్రీలో స్లిమ్ గా కనిపించే హీరోయిన్లలో కంగనా రనౌత్ కూడా ఒకరు.
జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి సినిమాలో కంగనా రనౌత్ నటించారు.
జయలలిత పాత్ర కొరకు కంగ్నా రనౌత్ ఏకంగా పది కిలోల బరువు పెరిగినట్టు తెలుస్తోంది.సినిమాలో తన లుక్ అందరికీ కచ్చితంగా నచ్చుతుందని కంగనా రనౌత్ ఆశాభావం వ్యక్తం చేశారు.అనుకోని అతిథి సినిమా కోసం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా బరువు పెరిగారు.