ప్రముఖ ఫ్రాన్స్ చిత్రకారుడు మానెట్ గీసిన పెయింటింగ్ కోసం న్యూయార్క్ నగరంలో వేలం నిర్వహించారు.కనీవినీ ఎరుగనిరీతిలో ఈ పెయింటింగ్ కోట్ల రూపాలు పలికింది.
మానెట్ గీసిన చిత్రాలని మేము ఎప్పటికప్పుడు వేలం నిర్వహిస్తున్నామని తాజాగా వచ్చిన వేలంలో ఈ పెయింటింగ్ ఇన్ని కోట్ల రూపాయలు పలకడం ఇదే ప్రధమమని తెలిపారు.ఈ పెయింటింగ్ విలువ 110.7మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.778 కోట్లు.
మోనెట్ 1890లో వేసిన 10 పెయింటింగ్లను వేలంలో ప్రదర్శనకి ఉంచామని వీటిలో క్లాడ్ పెయింటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు.ప్రకృతి రమణీయతను కళ్ళకి కట్టినట్టుగా చూపించడంలో మానెట్ చేయితిరిగిన కళాకారుడని, అందుకే ఆయన చిత్రాలకి ఇంతటి ప్రాముఖ్యత కలుగుతోందని అన్నారు.1986లో మోనెట్ గీసిన పెయింటింగ్ వేలంలో 2.5 మిలియన్ డాలర్లు ( రూ.17కోట్లు ) పలికింది అయితే
ఆ చిత్రాన్ని ఓ జిల్లా కలెక్టర్ కొనుగోలు చేశారని తెలిపారు.2016 నవంబర్ లో ఓ సంస్థ నిర్వహించిన వేలంలో మానెట్ పెయింటింగ్ కి దాదాపు రూ.572కోట్లు వచ్చాయని అన్నారు నిర్వాహకులు.ఇదిలాఉంటే వర్షం కురుస్తున్న సమయంలో లిల్లీ పుష్షాలు విచ్చుకుంటున్నట్టుగా గీసిన చిత్రం గత సంవత్సరం మే లో 84.6 మిలియన్ డాలర్లకు అంటే రూ.595 కోట్లకి అమ్ముడు పోయిందని నిర్వాహకులు తెలిపారు.