శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మెదడు ముందుంటుంది.మిగిలిన అవయవాలన్నీ బాగానే ఉన్నా మెదడు సరిగ్గా లేకుండా జీవితమే వేస్ట్ అవుతుంది.అందుకే మెదడును ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుకోవడం చాలా అవసరం.కానీ, ఇటీవల కాలంలో చాలా మంది మెదడు సంబంధిత జబ్బులతో బాధ పడుతున్నారు.ముఖ్యంగా బ్రెయిన్ డ్యామేజ్ సమస్యతో ప్రతి సంవత్సరం చాలా మంది ప్రాణాలు వీడుతున్నారు.అయితే మనకు ఉండే కొన్ని కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్కు గురవుతుంది.
మరి ఆ అలవాట్లు ఏంటో చూసేయండి.
నేటి ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ టాపులతోనే సమయాన్ని గడుపుతూ నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఈ అలవాటే మెదడుకు చేటుగా మారుతుంది.శరీరానికి తగినంత విశ్రాంతి లేకుండా ఆ ప్రభావం మెదడుపై పడుతుంది.
అందుకే రోజూ కన్నీసం ఎనిమిది గంటల పాటు నిద్రించాలి.
అలాగే చాలా మందికి ఉండే అలవాటు బ్రేక్ ఫాస్ట్ను స్కిప్ చేయడం.కానీ, ఇలా చేయడం వల్ల మెదడుకు ఏ మాత్రం మంచిది.టిఫిన్ తినకపోవడం వల్ల రక్తంలో సుగర్ లెవల్స్ తగ్గి మెదడు ఆరోగ్యం క్షీణిస్తుంది.
కొందరు ఏ చిన్న నొప్పి వచ్చినా పెయిన్ కిల్లర్ వేసేసుకుంటారు.మెదడుకు తీవ్ర హాని కలిగించే అలవాట్లలో ఇది ఒకటి.తరచూ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది.
అతిగా తినడం కూడా మెదడుకు ముప్పే.
చాలా మంది ఆహారం రుచిగా ఉందనో, ఇష్టమైన ఆహారమనో ఓవర్గా తినేస్తుంటారు.ఇలా చేయడం వల్ల బ్రెయిన్ హెల్త్ డ్యామేజ్ అవుతంది.
ఇక నీరు తక్కువగా తాగడం, స్యోకింగ్, షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, ఒత్తిడిని పెంచుకోవడం, అతిగా మాట్లాడటం ఇవన్నీ కూడా మెదడు క్షీణతకు కారణమయ్యే అలవాట్లే.సో.వీటికి దూరంగా ఉండండి.