వింటర్ సీజన్ ప్రారంభం అయింది.మిగిలిన సీజన్స్తో పోలిస్తే.
ఈ చలి కాలంలో జబ్బులు బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.అందుకే, చలి కాలం రాగానే ఆరోగ్యం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
అలాగే ప్రతి రోజు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు నిండి ఉండేలా చూసుకోవాలి.ఇక ముఖ్యంగా ఈ సీజన్లో కొన్ని పండ్లను ఖచ్చితంగా తీసుకోవాలి.
మరి ఆ పండ్లు ఏంటీ.ఎందుకు తీసుకోవాలి.
అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా వింటజర్ సీజన్ ప్రారంభం అయ్యిందంటే.
చర్మం పొడిగా మరియు నిర్జీవంగా మారిపోతుంది.అయితే యాపిల్ పండు తినడం వల్ల.
అందులో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు చర్మంలో తేమను రక్షించి పొడి చర్మాన్ని దూరం చేస్తుంది.అదే సమయంలో చర్మాన్ని మృదువుగా మెరిపిస్తుంది.
అలాగే ఈ వింటర్ సీజన్లో చాలా మంది డిహైడ్రేషన్కు గురవుతుంటారు.అలాంటి వారు ప్రతి రోజు ఒక అరటి పండు తీసుకుంటే.
అందులో ఉండే విటమిన్ ఈ, విటమిన్ సీ మరియు పొటాషియం డిహైడ్రేషన్ సమస్యను దూరం చేస్తుంది.
కమలా పండు కూడా ఈ వింటర్ సీజన్లో తప్పకుండా తినాలి.ఎందుకంటే, అందులో ఉండే విటమిన్ సీ, ఫాస్పరస్, పొటాషియం, బీటా కెరోటిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు.రోగ నిరోధక శక్తిని బలపరిచి సీజనల్గా వచ్చే అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి.
అలాగే ఈ వింటర్ సీజన్లో ఖచ్చితంగా తీసుకోవాల్సిన పండ్లలో సీతాఫలం కూడా ఒకటి.
వింటర్లో విరి విరిగా దొరికే సీతాఫలం తినడం వల్ల.
ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది.ఇక ఈ పండ్లతో పాటుగా.
దానిమ్మ, జామ పండు, కివి పండు, స్ట్రాబెర్రీ వంటి పండ్లను కూడా ఈ చలి కాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి.