2020 సంవత్సరంలో లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో ప్రేక్షకులకు ప్రతిరోజూ ఊహించని స్థాయిలో ఎంటర్టైన్మెంట్ అందించిన షోగా బిగ్ బాస్ షో పేరును సంపాదించుకుంది.ఒకప్పుడు ఇతర భాషల్లోనే ప్రసారమైన బిగ్ బాస్ షో తెలుగులో కూడా ప్రసారం అవుతుండటంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.
సీజన్ 5 ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి వల్ల బిగ్ బాస్ షో అంతకంతకూ ఆలస్యం కావడానికి కారణమవుతోంది.
జులై లేదా ఆగష్టులో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుండగా ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు తెగ వినిపిస్తున్నాయి.
గతంలోనే వైరల్ అయిన కొన్ని పేర్లకు మరికొన్ని పేర్లు యాడ్ కావడం గమనార్హం.బిగ్ బాస్ షోలో షణ్ముఖ్, దుర్గారావు, హైపర్ ఆది, యాంకర్ రవి పాల్గొనబోతున్నారంటూ గతంలోనే వార్తలు రాగా ఆయా సెలబ్రిటీలు ఈ వార్తలపై స్పందించలేదు.
అయితే కొత్తగా శేఖర్ మాస్టర్, యాంకర్ ప్రత్యుష, యూట్యూబ్ యాంకర్ శివ, సినిమాల ద్వారా కమెడియన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న ప్రవీణ్, స్టార్ సింగర్ మంగ్లీ, యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేర్లు వినిపిస్తున్నాయి.వైరల్ అవుతున్న ఈ పేర్లలో ఎవరెవరు బిగ్ బాస్ షోలో పాల్గొంటారో చూడాల్సి ఉంది.కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5కు కూడా హోస్ట్ గా వ్యవహరించనుండటం గమనార్హం.
పాపులారిటీ సంపాదించుకున్న సెలబ్రిటీలే ఈ సీజన్ లో ఎక్కువగా పాల్గొనబోతున్నారని తెలుస్తుండగా ఎవరెవరు బిగ్ బాస్ షోలో పాల్గొంటారో చూడాల్సి ఉంది.వైరల్ అవుతున్న పేర్లలో ఉన్న కంటెస్టెంట్లే బిగ్ బాస్ షోలో పాల్గొంటే మాత్రం బిగ్ బాస్ షో ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.