మన టాలీవుడ్ స్టార్ హీరోలు అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు ఒక విషయంలో పోటీ పడుతున్నారు.అయితే ఈ పోటీ దేనికో అనుకునేరు.
వీరి పోటీ గురించి వింటే మీరు కూడా ఇది నిజమే అని అనుకుంటారు.ఇప్పుడు టాలీవుడ్ లో వీరి ముగ్గురి మధ్య జరుగుతున్న సన్నివేశం చూస్తుంటే మీకు కూడా ఇదే అనిపిస్తుంది.
ఏంటా పోటీ? అంటే.ఈ ముగ్గురు తమ సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే క్రమంలో నువ్వు ముందంటే నువ్వు ముందు అని పోటీ పడుతున్నారు.
కానీ ఎవ్వరూ సెట్స్ మీదకు తీసుకు వెళ్లినట్టు అనిపించడం లేదు.ముగ్గురు మంచి హిట్ అందుకునాన్రు.కానీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడంలో మాత్రం ఇంకా ఇంకా లేట్ చేస్తూనే ఉన్నారు.
మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
అయితే ఈ సినిమా ఘన విజయం సాధించిన ఇంకా కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు.త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ కొత్త సినిమా ఈ నెలలోనే స్టార్ట్ చేయాల్సి ఉంది.
కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.
అలాగే ఎన్టీఆర్ కూడా ట్రిపుల్ ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకుని పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
అయితే ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉన్నా కూడా ఈయన ఇంకా ఈ సినిమా స్టార్ట్ చేయలేదు.ఎప్పుడు మొదలు పెట్టనున్నారో కూడా తెలియదు.
రోజురోజుకూ ఈ సినిమా గురించి రూమర్స్ మాత్రం వస్తూనే ఉన్నాయి.
ఇంకా పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకుని అఖండమైన విజయం సొంతం చేసుకున్నాడు.అయితే ఈ సినిమా పార్ట్ 2 కూడా తెరకెక్కుతుంది.ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయినా పార్ట్ 2 ఇంకా స్టార్ట్ కాలేదు.
అప్పుడు స్టార్ట్ అవుతుందో.ఎందుకు ఆలస్యం అవుతుందో కూడా తెలియదు.
ప్రెసెంట్ టాలీవుడ్ లో బంద్ కొనసాగుతున్న కారణంగా ఈ సినిమాలు ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.ఇలా ఈ ముగ్గురు హీరోలు తమ కొత్త సినిమాలను స్టార్ట్ చేయక పోవడంతో ఇంస్ట్రీలో చాలా మంది ఉపాధి లేకుండా కాలీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరి వీరు ఎప్పుడు మేల్కొంటారో చూడాలి.