ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఇప్పటికే కరోనా వాక్సినేషన్ పక్రియ మొదలైపోయింది.ఇకపోతే ఈ నేపథ్యంలో కారోన వ్యాక్సినేషన్ పై అనేక అనుమానాలు మనుషుల్లో మరింతగా పెరిగిపోతున్నాయి.
ఈ వాక్సినేషన్ వేసుకోవడం అనేది మంచిదేనా.? లేకపోతే అది వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో.అన్న ఆలోచన రావడం ఎక్కువైపోయింది.ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య విభాగం అధికారులు కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
కరోనా టీకాలు వేయించడం చాలా సురక్షితమని వాటిని ఎలాంటి అనుమానాలు లేకుండా చేయించుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు.
ఎలాంటి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత అయిన జ్వరం రావడం.అలాగే వాటితో పాటు కొన్ని రోజులు కండరాల నొప్పి, అలాగే దురదలు రావడం లాంటి లక్షణాలు కనపడతాయి.
వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలియజేశారు.
ప్రజలకు టీకాల సామర్థ్యంపై ఎలాంటి అపోహలు కలిగి ఉండాల్సిన అవసరం లేదని.కేవలం కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇంజక్షన్ వేసినప్పుడు మాత్రమే కాకుండా మామూలుగా ఉపయోగించే ఎన్నో రకాల వ్యాక్సిన్ లు వాడుతున్నామని అలాంటివి వేసుకున్నప్పుడు కూడా మన శరీరంలో రియాక్షన్లు కనిపిస్తాయని వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని.అవి సర్వసాధారణమని అధికారులు ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నారు.
నిజానికి కొందరికి వ్యాక్సిన్ వేసిన తర్వాత జ్వరం వస్తుందని దీనికి కారణం వ్యాక్సినేషన్ కు మన శరీరం ప్రతి స్పందిస్తుందని.అంతేగాని, ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కానే కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇలా వ్యాక్సినేషన్ చేయించుకున్నప్పుడు జ్వరం కండరాల నొప్పులు దురదలు లాంటి అత్యంత సర్వసాధారణమైన లక్షణాలని అధికారులు తెలుపుతున్నారు.ఒకవేళ ఇలాంటి సైడ్ఎఫెక్ట్స్ వచ్చిన కేవలం రెండు లేదా మూడు రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయని వైద్య అధికారులు తెలుపుతున్నారు.