మొతేరా మైదానం వేదికగా జరిగిన ఇంగ్లాండ్, భారత్ నాలుగో టెస్టులో టీమ్ ఇండియా 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కి చేరుకున్న భారత్ లార్డ్స్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో తలపడనుంది.
అయితే ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో పలు అవార్డులు, రికార్డులు నమోదయ్యాయి.అవేంటో ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.
ఈ టెస్ట్ సిరీస్ లో భారత బౌలర్లు 25 మంది ఇంగ్లండ్ బ్యాట్ మెన్ లను ఎల్బి లు చేశారు.గతంలో మన ఇండియన్ క్రికెట్ బౌలర్లు ఒక సిరీస్ 24 ఎల్బి చేసి చరిత్ర సృష్టించారు.
కానీ ఈ సారి ఆ రికార్డ్ ని చెరిపివేసి 25 వికెట్లను ఎల్బిల రూపంలో తీసి ఆశ్చర్యపరిచారు.నాల్గు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ ఓడిపోయి ఆ తర్వాత సిరీస్ కైవసం చేసుకోవటం టీమ్ ఇండియా కి ఇది మూడవసారి.
ఐతే 3, 4 టెస్ట్ సిరీస్స్ లలో తొలి మ్యాచ్ ఓడిపోయి సిరీస్ కైవసం చేసుకోవడం భారత్ కి ఇది ఆరవసారి.ఇటీవల జరిగిన ఇంగ్లాండ్, ఇండియా టెస్ట్ సిరీస్ తో భారత గడ్డపై విరాట్ కోహ్లీ నాయకత్వంలో 23 టెస్టుల్లో టీం ఇండియా గెలిచింది.
దీనితో సొంతగడ్డపై అత్యధిక టెస్ట్ మ్యాచులు గెలిచిన క్రికెట్ కెప్టెన్ లలో విరాట్ కోహ్లీ మూడవ స్థానానికి ఎగబాకారు.
మొదటి మూడు టెస్ట్ మ్యాచ్ల తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అక్షర్ పటేల్ నాలుగవ స్థానాన్ని దక్కించుకున్నారు.ఇకపోతే రవిచంద్రన్ అశ్విన్ నాలుగు మ్యాచులలో 31 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రిషబ్ పంత్, ఆఫ్ ది సిరీస్ అవార్డు రవిచంద్రన్ అశ్విన్ గెలుచుకున్నారు.
ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ జో రూట్ 368 పరుగులు చేసి అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించారు.రోహిత్ శర్మ 43 బౌండరీలతో అత్యధిక బౌండరీలు సాధించిన ప్లేయర్ గా నిలిచారు.
రహానే మరియు పంత్ 8 క్యాచ్లు పట్టి అత్యధిక క్యాచ్ లు పట్టిన ప్లేయర్లు గా నిలిచారు.