ఒకప్పుడు తెలుగు సినిమాలంటే చాలా చులకనగా మాట్లాడేవారు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది.
ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో మన తెలుగు సినిమాలు దూసుకెళ్తున్నాయి.హాలీవుడ్కి ఏమాత్రం తీసుకొని విధంగా జక్కన్న తీస్తున్న సినిమాలే దీనికి కారణం.
అయితే రాజమౌళి డైరెక్ట్ చేయని టాలీవుడ్ సినిమాలు కూడా భారతదేశాన్ని షేక్ చేస్తూ వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి.రీసెంట్ టైమ్లోనే టాలీవుడ్ నుంచి వచ్చిన చాలా సినిమాలు రూ.200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ చేసి ఆశ్చర్యపరిచాయి.అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
• అల వైకుంఠపురములో:
బన్నీ మూవీ ‘అల వైకుంఠపురములో’ 2020లో విడుదలై రూ.152 కోట్ల షేర్, రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
• సైరా నరసింహా రెడ్డి:
చిరంజీవి యాక్ట్ చేసిన పీరియాడికల్ డ్రామా సైరా నరసింహా రెడ్డి భారీ హిట్ అయింది.ఈ మూవీ దాదాపు రూ.240 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి వావ్ అనిపించింది.ఈ మూవీ రూ.140 కోట్ల షేర్ వసూలు చేసింది.
• సరిలేరు నీకెవ్వరూ:
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా 2020 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ మూవీ రూ.235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది.అలానే రూ.130 కోట్ల షేర్ని ఈ మూవీ సొంతం చేసుకుంది.
• రంగస్థలం:
మగధీర తర్వాత మళ్లీ అంతటి బ్లాక్ బస్టర్ హిట్ రంగస్థలం సినిమా రూపంలో చెర్రీకి దక్కింది.విలేజ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ రూ.216 కోట్ల గ్రాస్ , రూ.123 కోట్ల షేర్స్ కలెక్ట్ చేసింది.2018లో రంగస్థలం రిలీజ్ అయింది.ఆ టైంలో బాహుబలి తప్ప 200 కోట్ల క్లబ్ లో చేరిన తెలుగు సినిమా లేకపోవడం విశేషం.
• వాల్తేరు వీరయ్య:
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ కమర్షియల్ మూవీ వాల్తేరు వీరయ్య 10 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు చేసింది.ఈ మూవీ రూ.300 కోట్ల వసూలు చేసినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదని కొందరు ట్రేడ్ నిపుణులు అంటున్నారు.