సిరివెన్నెల సీతారామశాస్త్రి కడసారి చూపుకోసం వచ్చిన సినీ ప్రముఖులు వీరే?

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ నెల 24వ తేదీ న్యూమోనియాతో బాధ పడుతూ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు.అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ఆయన మృతి చెందారు.

 These Are The Celebrities Came To See Sirivennela Sitaramashastri For The Last T-TeluguStop.com

ఈ విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు సిరివెన్నెల మృతి పై స్పందిస్తూ ఆయనతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు.

ఇకపోతే సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతదేహాన్ని బుధవారం ఉదయం ఫిల్మింఛాంబర్‌ కి తీసుకువచ్చారు.ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు అభిమానులు ఫిల్మింఛాంబర్‌ కి చేరుకుని ఆయన పార్థివ దేహానికి ఘన నివాళి అర్పించారు.

సినీ ప్రముకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వెంకటేష్ పవన్ కళ్యాణ్, నాని, రానా, అల్లు అర్జున్, జగపతి బాబు వంటి ప్రముఖులు ఫిల్మింఛాంబర్‌  చేరుకొని సీతారామశాస్త్రి పార్థివ దేహానికి కన్నీటి నివాళులు అర్పించారు.

Telugu Time, Music, Tollywood-Movie

కేవలం హీరోలు మాత్రమే కాకుండా నిర్మాతలు దర్శకులు రాజమౌళి, క్రిష్,వంటి వారు అలాగే తనికెళ్ల భరణి పరుచూరి బ్రదర్స, ఎస్.వి కృష్ణారెడ్డి అల్లు అరవింద్, చోటా కె .నాయుడు, సింగర్ సునీత వంటి వారు ఈయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.ఇకపోతే ఈయన అంత్యక్రియలు 1:00 సమయంలో జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో జరగనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube