భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.రొటీన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం సాగిందని, ఏమాత్రం ఆరోగ్యవంతమైన కామెడీ లేదు అంటూ సినీ వర్గాల వారు విమర్శలు చేస్తున్నారు.
ఈ చిత్రం ఎలాంటి ఫలితం దక్కించుకుంటుందా అని ఎదురు చూసిన సినీ వర్గాల వారికి క్లారిటీ వచ్చేసింది.‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా ఒక ఫ్లాప్ మూవీ అంటూ అంతా ఒక నిర్ణయానికి వచ్చారు.
ఇక ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్న రవితేజ, ఇలియానా, శ్రీనువైట్లలకు అత్యంత కఠినమైన ఫలితం ఇది అని చెప్పక తప్పదు.
వరుసగా ఫ్లాప్లతో సతమతం అవుతున్న రవితేజ ఈ చిత్రంతో సక్సెస్ దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు.అయితే ఈ చిత్రం కూడా ఆయనకు తీవ్రంగా నిరాశ పర్చింది.ఇక శ్రీనువైట్లకు ఏకంగా నాలుగు అట్టర్ ఫ్లాప్లు పడ్డాయి.
దాంతో వైట్ల కెరీర్ ఖతం అనుకున్నారు.అయితే వైట్ల ఈసారి కూడా రొటీన్ కథనంతో ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.
మొత్తానికి వైట్ల కెరీర్ ఈ చిత్రంతో ఖతం అయినట్లేనా అంటూ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా వల్ల రవితేజ ఇక హీరోగా నటించకపోవడం మంచిది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఇక చాలా కాలం తర్వాత ఈ చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానాకు కూడా ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.ముఖ్యంగా ఆమె మరీ లావు అవ్వడంతో పాటు మునుపటి రూపంలో కనిపించకపోవడంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.సినిమాకు ఆమె పెద్ద మైనస్ అనే వారు కూడా లేకపోలేదు.ఎన్నో ఆశలు పెట్టుకుని ఈముగ్గురు చేసిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోవడంతో పాటు, వారి కెరీర్లో మరో గుదిబండ మాదిరిగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.