ఆ గ్రామంలో కలకలం రేగింది.ఎప్పుడు.
ఎక్కడ చోటు చేసుకొని ఘటన ఇప్పుడు జరిగింది.అసలు ఇంత వరకు ఇలాంటి చర్య ఎవ్వరు చేసి ఉండరు.
ఇంతకీ ఆ గ్రామంలో ఏం జరిగింది.అంతగా దారుణమైన ఘటన ఎలా జరిగింది.
అసలు మ్యాటర్ లోకి వెళ్తేనే మీకు పూర్తిగా అర్ధం అవుతుంది.ఆ గ్రామంలో వింత ఘటన చోరు చేసుకుంది.
గుర్తు తెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
దీంతో ఆ గ్రామంలో కలకలం రేగుతుంది.
సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.సమాధిని తవ్వి పుర్రెను ఎత్తుకెళ్లారు.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు భయాందోళనకు గురి అవుతున్నారు.ఇలాంటి దుశ్చర్యకు ఎవరు పాల్పడి ఉంటారు అనేది వారికీ కూడా అర్ధం అవ్వడం లేదు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహిబాత్ పూర్ గ్రామా శివారులో గుర్తు తెలియని దుండగులు ఈ చర్యకు పాల్పడ్డారు.
ఒక మహిళ సమాధిని తవ్వి ఆ మహిళ పుర్రెను ఎత్తుకెళ్లారు.
దీంతో గ్రామంలో కలకలం చెలరేగింది.
ఆ గ్రామానికి చెందిన కొనింటి ఏలిసా బెతూ అనే మహిళ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మరణించిందట.వారి గ్రామా శివారులో గల పొలం వద్ద అంత్యక్రియలు నిర్వహించి సమాధి చేసారు.అయితే ఇప్పుడు అనూహ్యంగా మూడు సంవత్సరాల తర్వాత ఆమె సమాధి తవ్వి మరి పుర్రెను ఎత్తుకెళ్లారు.
జనవరి 6న గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.సమాధి తవ్వి కాళ్ళు, చేతులు, తల, పుర్రె ఎముకలను ఎత్తుకెళ్లారు.గమనించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి వచ్చి ఘటన స్థలిని పరిశీలించి దర్యాప్తు మొదలు పెట్టారు.ఏమైనా క్షుద్ర పూజల కోసం మహిళ ఎముకలను ఎత్తుకుని వెళ్ళారా? లేదంటే మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.