ఎంతమంది సిబ్బంది, డాక్టర్స్ అయిన తాత్కాలిక పద్ధతిలో తీసుకోవాలని సీఎం ఆదేశించారు.ఏబీసి నేస్తం ద్వారా ఇవ్వాల్సిన 589 కోట్ల విడుదలకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది…3లక్షల 92 వేల అగ్రవర్ణ పేదలకు ఒక్కొక్కరికి 15వేలు ఇవ్వాలని నిర్ణయం.
రాష్ట్రంలోని 7 మెడికల్ కాలేజ్ ల నిర్మాణానికి 7800 విడుదలకు క్యాబినెట్ నిర్ణయం… కొత్త పిఆర్సీ ప్రకారం వేతనాల ఇవ్వడానికి క్యాబినెట్ ఆమోదం… కోవిడ్ కారణంగా చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ లోగా కారుణ్య నియామకాలకు క్యాబినేట్ ఆమోదం.
జగనన్న టౌన్ షిప్ లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం , పెన్షనర్స్ కోసం 5 శాతం రిజర్వ్ చెయాడంతో పాటు 20శాతం రిబెట్ ఇవ్వాలని నిర్ణయం… కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ ను 25 ఏళ్ల పాటు సమర్ధవంతమైన సంస్థకు ఇవ్వాలని నిర్ణయం.
కిదాంబి శ్రీకాంత్ కు బాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తిరుపతిలో 5 ఎకరాల భూమి కేటాయింపు … గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకంలో స్వల్ప మార్పులు.
రెండు వాయిదాలలో డబ్బులు చెల్లించడానికి వెసులుబాటు కల్పిస్తూ క్యాబినెట్ ఆమోదం.
ధాన్యం కొనుగోలు కు సంబంధించి పౌర సరఫరాల కార్పొరేషన్ కు 2వేల కోట్లు రుణం తీసుకోవడానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం… ఉద్యోగ సంఘాల సమస్యలు పై సీఎస్ వాళ్లతో మాట్లాడతారు.ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ చర్చించబోతున్నారు.
సీఎస్ ,సజ్జల ,ముగ్గురు మంత్రులు సంప్రదింపుల కమిటీ వేశారని మీడియాలొనే చూశాను.సంప్రదింపులు చేయడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి.
చంద్రబాబు మాటలు వినడం.గాడిద ఎక్కడం ఒకటే.
ఉపాద్యాయులను ఎన్నిరకాలుగా చంద్రబాబు ఇబ్బంది పెట్టారో మర్చిపోయారా? ఉద్యోగులు చంద్రబాబు ముసలి కన్నీరు చూసి మోసపోవద్దు ముఖ్యమంత్రి గురించి అసభ్యంగా మాట్లాడడం వల్ల పిఆర్సీ వస్తోందా?.చదువులు చెప్పే టీచర్లు ఇలా అసభ్యకరంగా మాట్లాడం సరైందేనా? ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి… అలా అని ఇలా మాట్లాడం మంచిది కాదు.